కరంజ్ జలాంతర్గామి లాంచ్ చేసిన నావికాదళం
- January 31, 2018
ముంబయి: భారత నావికాదళంలో స్కార్పీన్ శ్రేణికి చెందిన మూడో జలాంతర్గామి ఐఎన్ఎస్ కర్నాజ్ జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్ అడ్మైరల్ సునీల్ లంబా సతీమణి రీనా లంబా జలాంతర్గామిని ప్రారంభించారు. నావికాదళంలోకి చేర్చడానికి ముందు ఏడాది పాటు ఈ జలాంతర్గామిని క్షుణ్ణంగా పరీక్షించనున్నట్లు సునీల్ లంబా వెల్లడించారు. దీనిని ముంబయిలోని మజగావ్ డాక్యార్డ్లో నిర్మించారు. మొత్తం ఆరు జలాంతర్గాములను నిర్మించనున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ నౌకల తయారీ సంస్థ డీసీఎన్ఎస్ భాగస్వామ్యంతో జలాంతర్గాములను నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ స్కార్పీన్ తరగతికి చెందిన కలవరి జలాంతర్గామిని నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







