కరంజ్ జలాంతర్గామి లాంచ్ చేసిన నావికాదళం
- January 31, 2018
ముంబయి: భారత నావికాదళంలో స్కార్పీన్ శ్రేణికి చెందిన మూడో జలాంతర్గామి ఐఎన్ఎస్ కర్నాజ్ జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్ అడ్మైరల్ సునీల్ లంబా సతీమణి రీనా లంబా జలాంతర్గామిని ప్రారంభించారు. నావికాదళంలోకి చేర్చడానికి ముందు ఏడాది పాటు ఈ జలాంతర్గామిని క్షుణ్ణంగా పరీక్షించనున్నట్లు సునీల్ లంబా వెల్లడించారు. దీనిని ముంబయిలోని మజగావ్ డాక్యార్డ్లో నిర్మించారు. మొత్తం ఆరు జలాంతర్గాములను నిర్మించనున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ నౌకల తయారీ సంస్థ డీసీఎన్ఎస్ భాగస్వామ్యంతో జలాంతర్గాములను నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ స్కార్పీన్ తరగతికి చెందిన కలవరి జలాంతర్గామిని నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి









