కరంజ్ జలాంతర్గామి లాంచ్‌ చేసిన నావికాదళం

- January 31, 2018 , by Maagulf
కరంజ్ జలాంతర్గామి లాంచ్‌ చేసిన నావికాదళం

ముంబయి: భారత నావికాదళంలో స్కార్పీన్‌ శ్రేణికి చెందిన మూడో జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ కర్నాజ్‌ జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్‌ అడ్మైరల్‌ సునీల్‌ లంబా సతీమణి రీనా లంబా జలాంతర్గామిని ప్రారంభించారు. నావికాదళంలోకి చేర్చడానికి ముందు ఏడాది పాటు ఈ జలాంతర్గామిని క్షుణ్ణంగా పరీక్షించనున్నట్లు సునీల్‌ లంబా వెల్లడించారు. దీనిని ముంబయిలోని మజగావ్‌ డాక్‌యార్డ్‌లో నిర్మించారు. మొత్తం ఆరు జలాంతర్గాములను నిర్మించనున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ నౌకల తయారీ సంస్థ డీసీఎన్ఎస్‌ భాగస్వామ్యంతో జలాంతర్గాములను నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ స్కార్పీన్‌ తరగతికి చెందిన కలవరి జలాంతర్గామిని నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com