లైకా ప్రొడక్షన్స్ తో మణిరత్నం
- January 31, 2018
చెలియా సినిమాతో మరోసారి నిరాశపరిచిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. భారీ తారాగణంతో మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి చివరి వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఫహాద్ ఫాజిల్ లాంటి సౌత్ టాప్ స్టార్స్ నటిస్తున్నారు.
ఇంతటి భారీ చిత్రాన్ని మణిరత్నంతో కలిసి నిర్మించేందుకు భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ముందుకు వచ్చింది. మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్ మణిరత్నం తదుపరి చిత్రాన్ని నిర్మించనుంది. వరుసగా భారీ చిత్రాలను రూపొందిస్తున్న లైకా సంస్థ మణిరత్నంతో కలవటంతో అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. మణి స్టైల్ లో రూపొందనున్న ఈ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి అందిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









