అక్రమంగా ఫుడ్ అమ్మకం, తయారీ: వలసదారుల అరెస్ట్
- February 01, 2018
మస్కట్: ముట్రాహ్లో పలువురు వలస కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. వలస కార్మికులు అక్రమంగా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల్ని తయారు చేస్తూ, వాటిని విక్రయిస్తున్నట్లు గుర్తించామని మస్కట్ మునిసిపాలిటీ అధికారులు తెలిపారు. రాయల్ ఒమన్ పోలీసులతో కలిసి మస్కట్ మునిసిపాలిటీ - ముట్రా - అల్ కుబ్రా డిపార్ట్మెంట్, రెసిడెన్షియల్ సైట్ హిలాత్ అల్ అరీన్లో దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా వలస కార్మికులు ఆహార పదార్థాల్ని తయారు చేస్తూ పట్టుబడ్డారు. ఈ సందర్బంగా 40 కిలోల ఆహార పదార్థాల్ని ధ్వంసం చేశారు. ఇవి మానవులు సేవించడానికి ఏమాత్రం ఆరోగ్యకరంగా లేవని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









