సిట్రా సెంట్రల్ మార్కెట్ని సందర్శించిన గవర్నర్
- February 02, 2018
మనామా: సిట్రా సెంట్రల్ మార్కెట్ని మరింత ఆధునీకరించేందుకు, అక్కడ సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా, మార్కెట్ని సందర్శించారు. క్యాపిటల్ ట్రస్టీస్ బోర్డ్ డైరెక్టర్ జనరల్ షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ఖలీఫా, క్యాపిటల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఖాలిద్ అల్ ధవాది, మినిస్ట్రీకి సంబంధించిన పలువురు అధికారులు గవర్నర్ వెంట ఈ పర్యటనలో ఉన్నారు. మార్కెట్కి సంబంధించి అత్యవసర విషయాలపై గవర్నర్ తెలుసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్క్రౌన్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సిట్రా మార్కెట్ విషయమై తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ అభినందించారు. పౌరుల నుంచి మార్కెట్కి సంబంధించి అభిప్రాయాలు తెలుసుకోవడం, అలాగే కొన్ని ఇబ్బందుల్ని తొలగించడం సహా పలు అంశాలపై గవర్నర్ ఈ సందర్భంగా చర్చించారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మరియు మునిసిపల్ ఎఫైర్స్ అలాగే అర్బన్ ప్లానింగ్ మార్కెట్ అప్డేట్కి సంబంధించి తయారు చేసిన ప్లాన్స్ని రివ్యూ చేశారు గవర్నర్.
తాజా వార్తలు
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!









