సిట్రా సెంట్రల్ మార్కెట్ని సందర్శించిన గవర్నర్
- February 02, 2018
మనామా: సిట్రా సెంట్రల్ మార్కెట్ని మరింత ఆధునీకరించేందుకు, అక్కడ సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా, మార్కెట్ని సందర్శించారు. క్యాపిటల్ ట్రస్టీస్ బోర్డ్ డైరెక్టర్ జనరల్ షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ఖలీఫా, క్యాపిటల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఖాలిద్ అల్ ధవాది, మినిస్ట్రీకి సంబంధించిన పలువురు అధికారులు గవర్నర్ వెంట ఈ పర్యటనలో ఉన్నారు. మార్కెట్కి సంబంధించి అత్యవసర విషయాలపై గవర్నర్ తెలుసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్క్రౌన్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సిట్రా మార్కెట్ విషయమై తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ అభినందించారు. పౌరుల నుంచి మార్కెట్కి సంబంధించి అభిప్రాయాలు తెలుసుకోవడం, అలాగే కొన్ని ఇబ్బందుల్ని తొలగించడం సహా పలు అంశాలపై గవర్నర్ ఈ సందర్భంగా చర్చించారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మరియు మునిసిపల్ ఎఫైర్స్ అలాగే అర్బన్ ప్లానింగ్ మార్కెట్ అప్డేట్కి సంబంధించి తయారు చేసిన ప్లాన్స్ని రివ్యూ చేశారు గవర్నర్.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







