సిట్రా సెంట్రల్ మార్కెట్ని సందర్శించిన గవర్నర్
- February 02, 2018
మనామా: సిట్రా సెంట్రల్ మార్కెట్ని మరింత ఆధునీకరించేందుకు, అక్కడ సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా, మార్కెట్ని సందర్శించారు. క్యాపిటల్ ట్రస్టీస్ బోర్డ్ డైరెక్టర్ జనరల్ షేక్ మొహమ్మద్ బిన్ అహ్మద్ అల్ఖలీఫా, క్యాపిటల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఖాలిద్ అల్ ధవాది, మినిస్ట్రీకి సంబంధించిన పలువురు అధికారులు గవర్నర్ వెంట ఈ పర్యటనలో ఉన్నారు. మార్కెట్కి సంబంధించి అత్యవసర విషయాలపై గవర్నర్ తెలుసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్క్రౌన్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సిట్రా మార్కెట్ విషయమై తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ అభినందించారు. పౌరుల నుంచి మార్కెట్కి సంబంధించి అభిప్రాయాలు తెలుసుకోవడం, అలాగే కొన్ని ఇబ్బందుల్ని తొలగించడం సహా పలు అంశాలపై గవర్నర్ ఈ సందర్భంగా చర్చించారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మరియు మునిసిపల్ ఎఫైర్స్ అలాగే అర్బన్ ప్లానింగ్ మార్కెట్ అప్డేట్కి సంబంధించి తయారు చేసిన ప్లాన్స్ని రివ్యూ చేశారు గవర్నర్.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి