మధురై మీనాక్షి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం...
- February 02, 2018
తమిళనాడులోని ప్రసిద్ధ మధురై మీనాక్షి ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. టెంపుల్లోని వేయికాళ్ల మండపం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50కి పైగా చిన్న దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 10 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలార్పారు. కలెక్టర్ వీరరాఘవరావు మీనాక్షి దేవాలయానికి చేరుకుని పరిశీలించారు.
భద్రతాలోపం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం వద్దకు వేలాదిగా చేరుకుని ఆందోళనకు దిగారు. అధికారుల వాహనంపై రాళ్లు సైతం రువ్వారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆలయాన్ని తమ దిగ్బంధనంలోకి తీసుకున్నారు. ఆలయంలోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. చుట్టుపక్కల విద్యుత్ సరఫరా సైతం నిలిపివేశారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా? ఎప్పుడు అది పరువు నష్టం కేసుగా మారుతుందో తెలుసుకో
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







