మధురై మీనాక్షి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం...
- February 02, 2018
తమిళనాడులోని ప్రసిద్ధ మధురై మీనాక్షి ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. టెంపుల్లోని వేయికాళ్ల మండపం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50కి పైగా చిన్న దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 10 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలార్పారు. కలెక్టర్ వీరరాఘవరావు మీనాక్షి దేవాలయానికి చేరుకుని పరిశీలించారు.
భద్రతాలోపం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం వద్దకు వేలాదిగా చేరుకుని ఆందోళనకు దిగారు. అధికారుల వాహనంపై రాళ్లు సైతం రువ్వారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆలయాన్ని తమ దిగ్బంధనంలోకి తీసుకున్నారు. ఆలయంలోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. చుట్టుపక్కల విద్యుత్ సరఫరా సైతం నిలిపివేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి