మధురై మీనాక్షి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం...
- February 02, 2018
తమిళనాడులోని ప్రసిద్ధ మధురై మీనాక్షి ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. టెంపుల్లోని వేయికాళ్ల మండపం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50కి పైగా చిన్న దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 10 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలార్పారు. కలెక్టర్ వీరరాఘవరావు మీనాక్షి దేవాలయానికి చేరుకుని పరిశీలించారు.
భద్రతాలోపం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం వద్దకు వేలాదిగా చేరుకుని ఆందోళనకు దిగారు. అధికారుల వాహనంపై రాళ్లు సైతం రువ్వారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆలయాన్ని తమ దిగ్బంధనంలోకి తీసుకున్నారు. ఆలయంలోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. చుట్టుపక్కల విద్యుత్ సరఫరా సైతం నిలిపివేశారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









