నిధులును దారి మళ్లించిన సీఎం సిద్ధరామయ్య
- February 05, 2018
అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ కర్ణాటకలో ప్రారంభించిన నవనిర్మాణ పరివర్తన యాత్ర ప్రధాని నరేంద్ర మోడీ సభతో ఘనంగా ముగిసింది. బెంగళూరులోని ప్యాలస్ గ్రౌండ్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని.. రైతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. టమాటో, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు పండించే రైతులకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చామన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఆదుకోలేదన్న ప్రధాని.. తాము అన్నదాతల మేలు ముందడుగు వేశామని, మద్దతు ధర కల్పించడానికి కొత్త పథకాన్ని తీసుకొస్తున్నామన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నిష్క్రమణ దశలో ఉందని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్ పాలనకు తెర పడిందని అనడానికి ర్యాలీకి భారీగా హాజరైన ప్రజలే సంకేతం అన్నారు. ప్రజా సంక్షేమానికి కేంద్రం కేటాయించిన నిధులను కాంగ్రెస్ తన సంక్షేమానికి వాడుకుంటోందని ఆరోపించారు. కర్ణాటక అభివృద్ధికి ఉపయోగించాల్సిన నిధులను సీఎం సిద్ధరామయ్య దారిమళ్లించారని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్లో కర్ణాటకకు ఇచ్చిన తాయిలాల గురించి కూడా ప్రధాని ర్యాలీలో చెప్పారు. బెంగళూర్ మెట్రోకు 17 వేల కోట్లు కేటాయించాని, దీని ద్వారా 15 లక్షల మంది నగర ప్రయాణీకులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం ఆపరేషన్ గ్రీన్ చేపట్టామని..ఇది డైరీ రైతులకు అమూల్ తరహాలో మెరుగైన ప్రయోజనాలు అందిస్తుందని చెప్పారు. నవంబర్ 1న అమిత్ షా బెంగళూరులో ప్రారంభించిన నవనిర్మాణ యాత్ర 90 రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ సభతో ముగిసింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









