సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో దొంగతనం
- February 05, 2018
రూ.4లక్షలు మాయం ఫిల్మ్నగర్, న్యూస్టుడే: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో చోరి జరిగింది. ఇంట్లోని బీరువాలో భద్రపర్చిన రూ.4లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. బంజారాహిల్స్ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్లో నివాసముంటున్న సినీ సంగీత దర్శకులు మణిశర్మ కొద్ది రోజుల క్రితం ఇంట్లోని బీరువాలో రూ.4లక్షల నగదును భద్రపర్చారు. ఆదివారం అవసరాల నిమిత్తం ఆ నగదును తీసేందుకు చూడగా నగదు కన్పించక పోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో మణిశర్మ మేనేజర్ సుబ్బానాయుడు బంజారాహిల్స్ పోలీసులకు ఈ చోరీ ఘటనపై ఫిర్యాదు చేశారు. డీఐ కె.రవికుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









