సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో దొంగతనం
- February 05, 2018
రూ.4లక్షలు మాయం ఫిల్మ్నగర్, న్యూస్టుడే: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో చోరి జరిగింది. ఇంట్లోని బీరువాలో భద్రపర్చిన రూ.4లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. బంజారాహిల్స్ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్లో నివాసముంటున్న సినీ సంగీత దర్శకులు మణిశర్మ కొద్ది రోజుల క్రితం ఇంట్లోని బీరువాలో రూ.4లక్షల నగదును భద్రపర్చారు. ఆదివారం అవసరాల నిమిత్తం ఆ నగదును తీసేందుకు చూడగా నగదు కన్పించక పోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో మణిశర్మ మేనేజర్ సుబ్బానాయుడు బంజారాహిల్స్ పోలీసులకు ఈ చోరీ ఘటనపై ఫిర్యాదు చేశారు. డీఐ కె.రవికుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు