సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో దొంగతనం
- February 05, 2018
రూ.4లక్షలు మాయం ఫిల్మ్నగర్, న్యూస్టుడే: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో చోరి జరిగింది. ఇంట్లోని బీరువాలో భద్రపర్చిన రూ.4లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. బంజారాహిల్స్ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్లో నివాసముంటున్న సినీ సంగీత దర్శకులు మణిశర్మ కొద్ది రోజుల క్రితం ఇంట్లోని బీరువాలో రూ.4లక్షల నగదును భద్రపర్చారు. ఆదివారం అవసరాల నిమిత్తం ఆ నగదును తీసేందుకు చూడగా నగదు కన్పించక పోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో మణిశర్మ మేనేజర్ సుబ్బానాయుడు బంజారాహిల్స్ పోలీసులకు ఈ చోరీ ఘటనపై ఫిర్యాదు చేశారు. డీఐ కె.రవికుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







