తైవాన్లో భారీ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4
- February 06, 2018
-కుప్పకూలిన హోటల్ -శిథిలాల కింద 30 మంది చిక్కుకున్నట్లు అనుమానం తైపే: తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. తీరప్రాంత నగరం హాలియన్కు 21 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. ప్రాణనష్టం, ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 11.50 గంటలకు సంభవించిన ఈ ఘటనలో మార్షల్ హోటల్ భవనం కుప్పకూలి పలువురు చిక్కుకుపోయినట్లు తైవాన్ ప్రభుత్వం వెల్లడించింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అత్యవసర విభాగం రంగంలోకి దిగింది. భూకంపం ధాటికి హోటల్తో పాటు పలు భవనాలు కుప్పకూలిపోయాయని, శిథిలాల కింద సుమారు 30 మంది చిక్కుకుని ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది. ఆదివారం కూడా ఇదే ప్రాంతంలో నిమిషాల వ్యవధిలో ఐదు సార్లు ప్రకంపనలు వచ్చినట్లు తైవాన్ వాతావరణ శాఖ తెలిపింది. 1999 సెప్టెంబర్ నెలలో తైవాన్లో భూకంపం సంభవించి సుమారు 2400 మంది మృత్యువాతపడ్డారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి
- ఇరాన్ పాఠశాల పై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి
- ఖతార్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!
- ముహర్రక్ లో రోడ్ యాక్సెస్, సేఫ్టీ పై కౌన్సిల్ ఫోకస్..!!
- వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు









