తైవాన్లో భారీ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4
- February 06, 2018
-కుప్పకూలిన హోటల్ -శిథిలాల కింద 30 మంది చిక్కుకున్నట్లు అనుమానం తైపే: తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. తీరప్రాంత నగరం హాలియన్కు 21 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. ప్రాణనష్టం, ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 11.50 గంటలకు సంభవించిన ఈ ఘటనలో మార్షల్ హోటల్ భవనం కుప్పకూలి పలువురు చిక్కుకుపోయినట్లు తైవాన్ ప్రభుత్వం వెల్లడించింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అత్యవసర విభాగం రంగంలోకి దిగింది. భూకంపం ధాటికి హోటల్తో పాటు పలు భవనాలు కుప్పకూలిపోయాయని, శిథిలాల కింద సుమారు 30 మంది చిక్కుకుని ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది. ఆదివారం కూడా ఇదే ప్రాంతంలో నిమిషాల వ్యవధిలో ఐదు సార్లు ప్రకంపనలు వచ్చినట్లు తైవాన్ వాతావరణ శాఖ తెలిపింది. 1999 సెప్టెంబర్ నెలలో తైవాన్లో భూకంపం సంభవించి సుమారు 2400 మంది మృత్యువాతపడ్డారు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







