ఇయర్ ఫోన్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నారా.. ఇకపై చార్జ్షీట్ దాఖలు , జైలు శిక్ష
- February 14, 2018
లేవడం ఆలస్యం చేతిలో ఫోను, చెవిలో ఇయర్ ఫోన్.. ఇదండీ వరస. సరే ఇంట్లో ఎలా ఉన్నా పర్లేదు. అయితే రోడ్డు దాటుతున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, బస్సులు ఎక్కుతున్నప్పుడు కూడా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతూనో, పాటలు వింటూనో పరధ్యానంగా ఉంటారు. వచ్చే వాహనాల మోత వినిపించదు. పక్కన ఎవరు పలకరించినా ఏమీ పట్టదు. ఈ నిర్లక్ష్యం ప్రమాదాలకు దారి తీస్తుంది. ఒక్కోసారి ప్రాణాలు తీస్తుంది. మొన్నటికి మొన్న ఓ సాప్ట్వేర్ ఉద్యోగి అందులో ఆమె ప్రెగ్నెంట్ కూడా. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రోడ్డు క్రాస్ చేస్తోంది. ఇంతలో సిగ్నల్ పడింది. సిగ్నల్ పడిన విషయాన్ని పట్టించుకోకుండా ఓ బస్ డ్రైవర్ క్రాస్ చేశాడు. హారన్ మోగించాడు. అయినా ఆమెకు వినిపించలేదు. ఫలితం రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఈ సంఘటనను సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ నగర పోలీసులు ఇకపై పాదచారులే కాదు, వాహనం నడిపేవారు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా చార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు, జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ విధానాన్ని అమలు పరిచి 192 మందిపై చార్జ్షీట్ దాఖలు చేశారు. త్వరలో సెల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారిపై కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







