ప్రధాని నరేంద్ర మోడీ.. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ...?
- February 16, 2018
చాయ్పే చర్చతో దేశంలో కొత్త ట్రెండ్ సృష్టించిన ప్రధాని నరేంద్ర మోడీ.. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం పరీక్షాపే చర్చా కార్యక్రమంలో నిర్వహించారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగిన చర్చాగోష్ఠికి భారీగా హాజరైన విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల్లో ఒత్తిడిని ఎలా అధిగమించాలి అనే విషయంలో విద్యార్థులకు సూచనలు అందించారు.
పరీక్షలకు సన్నద్ధమవుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యమని ప్రధాని విద్యార్థులకు సూచించారు. యోగా ద్వారా ఏకాగ్రత సాధించవచ్చన్నారు. యోగా కేవలం శరీరం కోసమే కాదన్న ప్రధాని.. ఆసనాలు వేయడం ద్వారా మనసును కూడా ఉత్తేజితం చేయచ్చన్నారు. మనసు, బుద్ధి, శరీరం, ఆత్మను ఏకతాటిపైకి తెస్తే ఏకాగ్రత కుదురుతుందని విద్యార్థులకు తెలిపారు. యోగా ద్వారా ఏకాగ్రత సాధిస్తే పరీక్షల్లో విజయం సాధించవచ్చన్నారు.
విద్యార్థులు పరీక్ష ఒత్తిడిని ఎలా తట్టుకోవాలనేదానిపై ప్రధాని ఎగ్జామ్స్ వారియర్ అనే పుస్తకం రాశారు. దానిని ఇటీవలే మార్కెట్లో విడుదల చేశారు. ఇప్పుడు పరీక్షలు రాసే విద్యార్థుల కోసం స్వయంగా సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీగా హాజరయ్యారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









