ప్రధాని నరేంద్ర మోడీ.. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ...?
- February 16, 2018
చాయ్పే చర్చతో దేశంలో కొత్త ట్రెండ్ సృష్టించిన ప్రధాని నరేంద్ర మోడీ.. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం పరీక్షాపే చర్చా కార్యక్రమంలో నిర్వహించారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగిన చర్చాగోష్ఠికి భారీగా హాజరైన విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల్లో ఒత్తిడిని ఎలా అధిగమించాలి అనే విషయంలో విద్యార్థులకు సూచనలు అందించారు.
పరీక్షలకు సన్నద్ధమవుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యమని ప్రధాని విద్యార్థులకు సూచించారు. యోగా ద్వారా ఏకాగ్రత సాధించవచ్చన్నారు. యోగా కేవలం శరీరం కోసమే కాదన్న ప్రధాని.. ఆసనాలు వేయడం ద్వారా మనసును కూడా ఉత్తేజితం చేయచ్చన్నారు. మనసు, బుద్ధి, శరీరం, ఆత్మను ఏకతాటిపైకి తెస్తే ఏకాగ్రత కుదురుతుందని విద్యార్థులకు తెలిపారు. యోగా ద్వారా ఏకాగ్రత సాధిస్తే పరీక్షల్లో విజయం సాధించవచ్చన్నారు.
విద్యార్థులు పరీక్ష ఒత్తిడిని ఎలా తట్టుకోవాలనేదానిపై ప్రధాని ఎగ్జామ్స్ వారియర్ అనే పుస్తకం రాశారు. దానిని ఇటీవలే మార్కెట్లో విడుదల చేశారు. ఇప్పుడు పరీక్షలు రాసే విద్యార్థుల కోసం స్వయంగా సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీగా హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!







