వైజాగ్లో ఈ బండి ఎక్కితే నేలమీద, నీటిపై రయ్ రయ్...
- February 17, 2018
విశాఖకి మరో మణిహారం రాబోతుంది. గత నెలలో యుద్ధ విమానం, హెలీ టూరిజమ్ను అందుబాటులోకి తెచ్చిన పర్యాటక శాఖ.. ఇప్పుడు హోవర్ క్రాఫ్ట్ను సిద్ధం చేస్తోంది. నేల, నీటిపై రయ్ రయ్ మంటూ ఎంజాయ్ చేసే అవకాశాన్ని కల్పించబోతుంది. మార్చి నెలాఖరు నుంచి పర్యాటకులకు ఈ సేవలు అందుబాటులోకి రానుంది.
స్మార్ట్ సిటీగా ఎదుగుతోన్న విశాఖ.. పర్యాటక రంగానికి స్వర్గధామంగా మారుతోంది. బీచ్ సిటీగా.. దేశ, విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తోంది. సహజ సిద్ధమైన అందాలతో పర్యాటకుల మనసు దోచుకుంటోంది. కైలాసగిరి, సబ్ మెరైన్, ఎర్రమట్టి దిబ్బలను చూసి ప్రకృతి ప్రియులు తన్మయత్వం చెందుతున్నారు. అటు ప్రభుత్వం కూడా.. పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.
నీలి సంద్రంలో కేరింతలు కొట్టేందుకు, కెరటాలతో ఆడుకునే అవకాశాన్ని.... పర్యాటకులకు కల్పించేందుకు ఏపీ టూరిజం శాఖ హోవర్ క్రాఫ్ట్లు సిద్ధం చేస్తోంది. తీరం నుంచి రెండు కిలోమీటర్ల మేర సముద్రం లోపలికి వెళ్లి చక్కర్లు కొట్టేలా హోవర్ డాక్కు చెందిన రెండు హోవర్ క్రాఫ్ట్లను విశాఖ తీసుకొచ్చింది. ప్రస్తుతం సన్ రే రిసార్ట్స్ సమీపంలో ఉంచి పైలెట్లకు శిక్షణ ఇస్తోంది. మార్చి నెలాఖరు నాటికి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానుంది.
విశాఖలోని గోకుల్ పార్క్ సమీపంలో హోవర్ డాక్ సంస్థకు జీవిఎంసీ 4వేల గజాల స్థలాన్ని లీజుకు ఇచ్చింది. ఇప్పటికే అన్ని అనుమతులు మంజూరు చేసింది. హోవర్ క్రాఫ్ట్ లో ప్రయాణించేందుకు 300 నుంచి 500రూపాయలు చార్జ్ చేసే అవకాశముంది. త్వరలోనే ధరలు ఖరారు చేయనుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి