వైజాగ్లో ఈ బండి ఎక్కితే నేలమీద, నీటిపై రయ్ రయ్...
- February 17, 2018
విశాఖకి మరో మణిహారం రాబోతుంది. గత నెలలో యుద్ధ విమానం, హెలీ టూరిజమ్ను అందుబాటులోకి తెచ్చిన పర్యాటక శాఖ.. ఇప్పుడు హోవర్ క్రాఫ్ట్ను సిద్ధం చేస్తోంది. నేల, నీటిపై రయ్ రయ్ మంటూ ఎంజాయ్ చేసే అవకాశాన్ని కల్పించబోతుంది. మార్చి నెలాఖరు నుంచి పర్యాటకులకు ఈ సేవలు అందుబాటులోకి రానుంది.
స్మార్ట్ సిటీగా ఎదుగుతోన్న విశాఖ.. పర్యాటక రంగానికి స్వర్గధామంగా మారుతోంది. బీచ్ సిటీగా.. దేశ, విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తోంది. సహజ సిద్ధమైన అందాలతో పర్యాటకుల మనసు దోచుకుంటోంది. కైలాసగిరి, సబ్ మెరైన్, ఎర్రమట్టి దిబ్బలను చూసి ప్రకృతి ప్రియులు తన్మయత్వం చెందుతున్నారు. అటు ప్రభుత్వం కూడా.. పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.
నీలి సంద్రంలో కేరింతలు కొట్టేందుకు, కెరటాలతో ఆడుకునే అవకాశాన్ని.... పర్యాటకులకు కల్పించేందుకు ఏపీ టూరిజం శాఖ హోవర్ క్రాఫ్ట్లు సిద్ధం చేస్తోంది. తీరం నుంచి రెండు కిలోమీటర్ల మేర సముద్రం లోపలికి వెళ్లి చక్కర్లు కొట్టేలా హోవర్ డాక్కు చెందిన రెండు హోవర్ క్రాఫ్ట్లను విశాఖ తీసుకొచ్చింది. ప్రస్తుతం సన్ రే రిసార్ట్స్ సమీపంలో ఉంచి పైలెట్లకు శిక్షణ ఇస్తోంది. మార్చి నెలాఖరు నాటికి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానుంది.
విశాఖలోని గోకుల్ పార్క్ సమీపంలో హోవర్ డాక్ సంస్థకు జీవిఎంసీ 4వేల గజాల స్థలాన్ని లీజుకు ఇచ్చింది. ఇప్పటికే అన్ని అనుమతులు మంజూరు చేసింది. హోవర్ క్రాఫ్ట్ లో ప్రయాణించేందుకు 300 నుంచి 500రూపాయలు చార్జ్ చేసే అవకాశముంది. త్వరలోనే ధరలు ఖరారు చేయనుంది.
తాజా వార్తలు
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!







