సౌదీ అరేబియా రాజధాని రియాధ్లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ దినోత్సవం
- February 17, 2018
సౌదీ అరేబియా:సౌదీ అరేబియా రాజధాని రియాధ్లో సౌదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జనాద్రీయ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా భారతీయ ఎంబసీ ఆధ్వర్యంలో శనివారం ఆంధ్రప్రదేశ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రియాధ్లోని ఏపీ ఎన్నార్టీ కో-ఆర్డినేటర్ అంథోని ఆంధ్రప్రదేశ్ స్టాల్ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడి, పర్యాటక రంగంలో ఉన్న అవకాశాల గురించి సందర్శకులకు వివరించారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్ గతవారం ప్రారంభించిన జనాద్రీయ ఉత్సవాలకు కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ కూడా ప్రత్యేకంగా హాజరైన సంగతి తెలిసిందే. భారత్కు కేటాయించిన ప్రత్యేక స్థలంలో శనివారం ఆంధ్రప్రదేశ్ దినోత్సవాన్ని నిర్వహించారు. భారతీయ రాయబారి అహ్మద్ జావెద్ ఇతర సీనియర్ దౌత్యవేత్తలు, సౌదీ అరేబియా అధికారులు, ఆంధ్రపదేశ్ వేదికను సందర్శించి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకొన్నారు.ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన తరుణ్,వర్మ,సుమన్,సత్యం,విజయ ఆంథోనీకి మరియు క్లాసికల్ డాన్సర్స్ నమ్రత,రిత్విక,అశోక్ కు అంథోని ధన్యవాదాలు తెలియజేసారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







