భారత్‌కు చేరుకున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో

- February 17, 2018 , by Maagulf
భారత్‌కు చేరుకున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో

న్యూఢిల్లీ: ఏడురోజుల పర్యటనలో భాగంగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కుటుంబ సమేతంగా శనివారం భారత్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ట్రూడో రక్షణ, ఉగ్రవాదంసహా పలు కీలకాంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ట్రూడో 18న తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. మరుసటి రోజు గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని, గాంధీనగర్‌లోని అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం 20న ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నిర్మాతలతో ముంబైలో సమావేశమవుతారు. 21న స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com