ఫోన్ నంబర్ల మార్పుపై స్పందించిన 'డీవోటీ'..
- February 21, 2018
త్వరలో 10 సంఖ్యలుగా ఉన్న మొబైల్ నంబర్ను 13 సంఖ్యలకు మారుస్తున్నట్టు బుధవారం సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరిగింది. ఇక దీనిపై బుధవారమే స్పందించిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. కేవలం మెషిన్ టు మెషిన్(ఎం2ఎం) కు మాత్రమే భద్రతా కారణాలరీత్యా 10 సంఖ్యలను 13 కు మారుస్తున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ BSNL కూడా నంబర్ల మార్పు ఉండదని ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. మరింత భద్రత కోసం వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎం2ఎం సిమ్లలో 13 సంఖ్యల నంబర్ను జూలై 1 నుంచి జారీ చేయాలని డీవోటీ అన్ని టెలికం కంపెనీలను జనవరిలో ఆదేశించింది. అందులో భాగంగానే ఈ ప్రచారం జరిగింది ఇది కేవలం మెషిన్ టు మెషిన్ (ఎం2ఎం) సిమ్ లకు మాత్రమే వర్తిస్తుందని సాధారణ ఫోన్ నంబర్లలో ఎటువంటి మార్పు ఉండదని తెలిపింది. దీంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







