ఫోన్ నంబర్ల మార్పుపై స్పందించిన 'డీవోటీ'..
- February 21, 2018
త్వరలో 10 సంఖ్యలుగా ఉన్న మొబైల్ నంబర్ను 13 సంఖ్యలకు మారుస్తున్నట్టు బుధవారం సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరిగింది. ఇక దీనిపై బుధవారమే స్పందించిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. కేవలం మెషిన్ టు మెషిన్(ఎం2ఎం) కు మాత్రమే భద్రతా కారణాలరీత్యా 10 సంఖ్యలను 13 కు మారుస్తున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ BSNL కూడా నంబర్ల మార్పు ఉండదని ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. మరింత భద్రత కోసం వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎం2ఎం సిమ్లలో 13 సంఖ్యల నంబర్ను జూలై 1 నుంచి జారీ చేయాలని డీవోటీ అన్ని టెలికం కంపెనీలను జనవరిలో ఆదేశించింది. అందులో భాగంగానే ఈ ప్రచారం జరిగింది ఇది కేవలం మెషిన్ టు మెషిన్ (ఎం2ఎం) సిమ్ లకు మాత్రమే వర్తిస్తుందని సాధారణ ఫోన్ నంబర్లలో ఎటువంటి మార్పు ఉండదని తెలిపింది. దీంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







