పాతవారిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని సౌదీ రాజు సల్మాన్ సంచలన నిర్ణయం
- February 27, 2018
రియాద్:సౌదీ రాజు సల్మాన్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఆర్మీ చీఫ్ కమాండర్ పదవి నుండి అబ్దుల్ రహమాన్ బిన్ సలేహ్ అల్ బునియాన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకొన్నాడు. ఈ మేరకు సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకటించింది.
రహమాన్ స్థానంలో ఫయ్యాద్ అలీ రువాలీని నియమిస్తూ సౌదీ రాజు నిర్ణయం తీసుకొన్నాడని ప్రకటించింది.అంతేకాదు భూ, వైమానిక దళాలకు చెందిన సైన్యాధిపతులను కూడ రాజు ఇతరులతో భర్తీ చేశారు. పాతవారిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించారు.
అయితే రక్షణ విభాగంలో కీలకమైన మార్పులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన మాత్రం ఇవ్వలేదు. ఎందుకు వారికి మార్చాల్సి వచ్చిందనే విషయమై ప్రకటించలేదు.సౌదీ రాజు కుమారుడు రక్షణ మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది.
ప్రస్తుతం సౌదీ దళాలు యెమెన్ యుద్ధంలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆకస్మిక నిర్ణయం సంచలనం కలిగించింది. యెమెన్లో రెబల్స్ తరపున సౌదీ దళాలు పోరాటం చేస్తున్నాయి. దాదాపు మూడేళ్లుగా యెమెన్లో అంతర్యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. సౌదీలో జరిగిన ఆకస్మిక పరిణామాలకు అరబ్ దేశాలు ఆశ్చర్యపడుతున్నాయి
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







