పాతవారిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని సౌదీ రాజు సల్మాన్ సంచలన నిర్ణయం
- February 27, 2018
రియాద్:సౌదీ రాజు సల్మాన్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఆర్మీ చీఫ్ కమాండర్ పదవి నుండి అబ్దుల్ రహమాన్ బిన్ సలేహ్ అల్ బునియాన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకొన్నాడు. ఈ మేరకు సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకటించింది.
రహమాన్ స్థానంలో ఫయ్యాద్ అలీ రువాలీని నియమిస్తూ సౌదీ రాజు నిర్ణయం తీసుకొన్నాడని ప్రకటించింది.అంతేకాదు భూ, వైమానిక దళాలకు చెందిన సైన్యాధిపతులను కూడ రాజు ఇతరులతో భర్తీ చేశారు. పాతవారిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించారు.
అయితే రక్షణ విభాగంలో కీలకమైన మార్పులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన మాత్రం ఇవ్వలేదు. ఎందుకు వారికి మార్చాల్సి వచ్చిందనే విషయమై ప్రకటించలేదు.సౌదీ రాజు కుమారుడు రక్షణ మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది.
ప్రస్తుతం సౌదీ దళాలు యెమెన్ యుద్ధంలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆకస్మిక నిర్ణయం సంచలనం కలిగించింది. యెమెన్లో రెబల్స్ తరపున సౌదీ దళాలు పోరాటం చేస్తున్నాయి. దాదాపు మూడేళ్లుగా యెమెన్లో అంతర్యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. సౌదీలో జరిగిన ఆకస్మిక పరిణామాలకు అరబ్ దేశాలు ఆశ్చర్యపడుతున్నాయి
తాజా వార్తలు
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్







