4 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నేపాల్ యువకుడు
- March 02, 2018
దుబాయ్: అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని పసిపిల్లపై అకృత్యానికి పాల్పడ్డాడా నేపాల్ యువకుడు. 24 ఏళ్ల వయస్సు గల ఆ కామాంధుడు దుబాయ్ నగరంలోని ఓ ప్రాంతంలో క్లినర్గా పనిచేస్తున్నాడు. తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ సమీపంలో ఒంటరిగా కనిపించిన ఓ నాలుగేళ్ల బాలికను ఓ ఫ్లోట్లోకి తీసుకెళ్లి తలుపులు మూశాడు. నిందితుడు తన దుస్తులన్నీ విప్పేసి బాలికను ఎక్కడెక్కడో అసభ్యకరంగా తాకాడు. అసభ్యకర రీతిలో ముద్దులు పెట్టాడు. అనంతరం తలుపులు తెరవడంతో బాలిక అక్కడి నుంచి ఇంటికి పరుగుతీసింది. తన తల్లిని చూసి ఏడ్చింది. కానీ జరిగిన విషయం చెప్పలేకపోయింది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో సైతం బాగా ఆందోళన చెందింది. మళ్లీ నిందితుడు ఏమైనా చేస్తాడేమోనని విపరీతమైన ఆందోళనకు గురైంది. కానీ తల్లితో చెప్పలేదు. మరుసటి రోజు స్కూల్ నుంచి తల్లితో కలిసి ఇంటికి వస్తున్న సమయంలో నిందిత యువకుడు కనిపించడంతో కంగారు పడి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారు అపార్ట్మెంట్ లో సీసీ కెమేరాలలో పరిశీలించగా నిందిత యువకుడు బాలికను తీసుకెళ్తున్నట్టు సి సి ఫుటేజ్ లో నమోదైంది. బాలిక చెప్పిన విషయాలన్నీ సరిపోలాయని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై కోర్టులో విచారణ ప్రారంభైమనట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









