4 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నేపాల్ యువకుడు
- March 02, 2018
దుబాయ్: అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని పసిపిల్లపై అకృత్యానికి పాల్పడ్డాడా నేపాల్ యువకుడు. 24 ఏళ్ల వయస్సు గల ఆ కామాంధుడు దుబాయ్ నగరంలోని ఓ ప్రాంతంలో క్లినర్గా పనిచేస్తున్నాడు. తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ సమీపంలో ఒంటరిగా కనిపించిన ఓ నాలుగేళ్ల బాలికను ఓ ఫ్లోట్లోకి తీసుకెళ్లి తలుపులు మూశాడు. నిందితుడు తన దుస్తులన్నీ విప్పేసి బాలికను ఎక్కడెక్కడో అసభ్యకరంగా తాకాడు. అసభ్యకర రీతిలో ముద్దులు పెట్టాడు. అనంతరం తలుపులు తెరవడంతో బాలిక అక్కడి నుంచి ఇంటికి పరుగుతీసింది. తన తల్లిని చూసి ఏడ్చింది. కానీ జరిగిన విషయం చెప్పలేకపోయింది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో సైతం బాగా ఆందోళన చెందింది. మళ్లీ నిందితుడు ఏమైనా చేస్తాడేమోనని విపరీతమైన ఆందోళనకు గురైంది. కానీ తల్లితో చెప్పలేదు. మరుసటి రోజు స్కూల్ నుంచి తల్లితో కలిసి ఇంటికి వస్తున్న సమయంలో నిందిత యువకుడు కనిపించడంతో కంగారు పడి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారు అపార్ట్మెంట్ లో సీసీ కెమేరాలలో పరిశీలించగా నిందిత యువకుడు బాలికను తీసుకెళ్తున్నట్టు సి సి ఫుటేజ్ లో నమోదైంది. బాలిక చెప్పిన విషయాలన్నీ సరిపోలాయని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై కోర్టులో విచారణ ప్రారంభైమనట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







