ప్రిన్స్ మహేష్ బాబు 25వ చిత్రానికి సన్నాహాలు..
- March 02, 2018
మహేష్బాబు కథానాయకుడిగా రూపొందుతున్న భరత్ అనే నేను చిత్రం చిత్రీకరణ తుది దశకు చేరుకోవడంతో ఆయన నటించనున్న 25వ చిత్రానికి మరోవైపు సన్నాహాలు వేగవంతమయ్యాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ పతాకాలపై సి.అశ్వనీదత్, దిల్రాజులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ పనిచేయనున్నారు. బాలీవుడ్లో 2006లో వచ్చిన డాన్ చిత్రానికి, అలాగే తలాష్, రయీస్ వంటి భారీ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ని మోహనన్ అందించారు. మహేష్బాబు సరసన పూజాహెగ్డే నాయికగా నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్, సినిమాటోగ్రఫీ: కె.యు.మోహనన్, నిర్మాతలు: సి.అశ్వనీదత్, దిల్రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









