షేక్ మొహమ్మద్ టీమ్లో 70 శాతం మంది మహిళలే
- March 08, 2018
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మహిళలకు సందేశాన్నిచ్చారు. మార్చి 8వ తేదీ ఓ అద్భుతమైన మరియు ప్రత్యేకమైన రోజనీ, ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటారనీ, యూఏఈలోనూ మహిళలు ఈ రోజున ప్రత్యేకంగా సంబరాలు జరుపుకుంటారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాల్సి వుందనీ, మహిళా దినోత్సవం నాడు మాత్రమే కాక, ఏడాదిలో అన్ని రోజుల్లోనూ మహిళలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారాయన. తన టీమ్లో 70 శాతం మంది మహిళలే వున్నారని షేక్ మొహమ్మద్ గుర్తు చేశారు. ప్రతిరోజూ వారు ఎంతో నిబద్ధతో పనిచేస్తారనీ, ప్రతి మినిస్టర్, అలాగే గవర్నమెంట్ అఫీషియల్ మహిళల సేవల్ని కొనియాడాల్సి ఉంటుందని, యూఏఈ అభివృద్ధిలో మహిళల పాత్ర మరువలేమని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







