షేక్ మొహమ్మద్ టీమ్లో 70 శాతం మంది మహిళలే
- March 08, 2018
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మహిళలకు సందేశాన్నిచ్చారు. మార్చి 8వ తేదీ ఓ అద్భుతమైన మరియు ప్రత్యేకమైన రోజనీ, ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటారనీ, యూఏఈలోనూ మహిళలు ఈ రోజున ప్రత్యేకంగా సంబరాలు జరుపుకుంటారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాల్సి వుందనీ, మహిళా దినోత్సవం నాడు మాత్రమే కాక, ఏడాదిలో అన్ని రోజుల్లోనూ మహిళలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారాయన. తన టీమ్లో 70 శాతం మంది మహిళలే వున్నారని షేక్ మొహమ్మద్ గుర్తు చేశారు. ప్రతిరోజూ వారు ఎంతో నిబద్ధతో పనిచేస్తారనీ, ప్రతి మినిస్టర్, అలాగే గవర్నమెంట్ అఫీషియల్ మహిళల సేవల్ని కొనియాడాల్సి ఉంటుందని, యూఏఈ అభివృద్ధిలో మహిళల పాత్ర మరువలేమని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









