భారత వైమానిక దళం సరికొత్త నిర్ణయం
- November 29, 2015
భారత వైమానిక దళం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దేశంలోని హైవేలను రన్వేలుగా ఉపయోగించుకోనున్నట్లు భారత వైమానిక దళం ప్రకటించింది. యుద్ధ విమానాలు అత్యవసర సమయంలో ఎక్కడైనా ల్యాండ్ అయ్యే విధంగా వైమానిక దళం చర్యలు తీసుకుంటుంది. అయితే మిరేజ్ 2000 యుద్ధ విమానాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో నోయిడా - ఆగ్రా హైవేపై ల్యాండ్ చేసిన విషయం విదితమే. విజయవంతంగా మిరేజ్ హైవేపై ల్యాండ్ అయింది. ఈ క్రమంలో దేశ సరిహద్దుల్లో అత్యవసర సమయాల్లో అన్ని హైవేలపై యుద్ధ విమానాలను దింపేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు సరిహద్దుల్లోని హైవేలను విస్తరించాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు వైమానిక దళం విజ్ఞప్తి చేసిందిa
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







