నైజీరియా ఘర్షణలు, 25 మంది మృతి
- March 14, 2018
సెంట్రల్ నైజీరియాలో ఇటీవల జరిగిన ఘర్షణల్లో 25 మంది చనిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. భూమి, నీళ్లు, పశువుల మేత హక్కులకు సంబంధించి కొన్ని వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలిపారు. సోమవారం ప్లాటీ స్టేట్లోని బస్సా ప్రాంతంలో అధిక మంది చనిపోగా..తాజాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. పశువుల కాపరులు దుండన్ నుంచి ఝిరేచి గ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో జరిగిన కాల్పుల్లో 25 మంది చనిపోగా, ఇద్దరికి గాయాలయ్యాయని స్టేట్ పోలీస్ కమిషనర్ వుండీ అడీ తెలిపారు. వర్గాల మధ్య ఘర్షణలో పెద్ద సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయని, అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. గ్రామస్థులను పొట్టనబెట్టుకున్న వారిని మట్టుకరిపించేందుకు ప్రత్యేకంగా మ్యాన్ హంట్ ఆపరేషన్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దయచేసి ప్రజలంతా సంయమనంతో ఉండి..వారి ఆయుధాలను పక్కన పెట్టాలని, ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







