నైజీరియా ఘర్షణలు, 25 మంది మృతి
- March 14, 2018
సెంట్రల్ నైజీరియాలో ఇటీవల జరిగిన ఘర్షణల్లో 25 మంది చనిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. భూమి, నీళ్లు, పశువుల మేత హక్కులకు సంబంధించి కొన్ని వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలిపారు. సోమవారం ప్లాటీ స్టేట్లోని బస్సా ప్రాంతంలో అధిక మంది చనిపోగా..తాజాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. పశువుల కాపరులు దుండన్ నుంచి ఝిరేచి గ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో జరిగిన కాల్పుల్లో 25 మంది చనిపోగా, ఇద్దరికి గాయాలయ్యాయని స్టేట్ పోలీస్ కమిషనర్ వుండీ అడీ తెలిపారు. వర్గాల మధ్య ఘర్షణలో పెద్ద సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయని, అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. గ్రామస్థులను పొట్టనబెట్టుకున్న వారిని మట్టుకరిపించేందుకు ప్రత్యేకంగా మ్యాన్ హంట్ ఆపరేషన్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దయచేసి ప్రజలంతా సంయమనంతో ఉండి..వారి ఆయుధాలను పక్కన పెట్టాలని, ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







