శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య వాగ్వాదం
- March 16, 2018
జెంటిల్మెన్ గేమ్గా పేరున్న క్రికెట్లో ఆటగాళ్ళ మధ్య మాటల యుధ్ధం మామూలే... అయితే శ్రీలంక,బంగ్లాదేశ్ మధ్య జరిగిన పోరులో ఈ స్లెడ్జింగ్తో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. హోరాహోరీగా మ్యాచ్ జరుగుతోన్న సమయంలో లంక,బంగ్లా ఆటగాళ్ళ మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. దీనికి తోడు అంపైర్ల తప్పిదాలు కూడా వాతావరణాన్ని హీట్ చేశాయి. వరుసగా రెండు బౌన్సర్లు వేసినా... అంపైర్ నోబాల్ ఇవ్వకపోవడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్హసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రీజులో ఉన్న తమ బ్యాట్స్మెన్ను పెవిలియన్కు వచ్చేయమంటూ సూచనలు చేయడంతో కాసేపు గందరగోళం నెలకొంది. ఈ దశలో మ్యాచ్ రిఫరీ జోక్యం చేసుకుని సర్థి చెప్పడంతో మ్యాచ్ మళ్ళీ మొదలైంది. మ్యాచ్ అనంతరం శ్రీలంక, బంగ్లాదేశ్ల మధ్య తీవ్ర పరిణామాలు జరిగాయి. రెండు టీంల మధ్య ఏకంగా విధ్వంసకాండ చోటుచేసుకుంది. ఉత్కంఠపోరులో గెలిచిన తర్వాత బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేస్తూ లంకను గేలిచేశారు. దీంతో లంకా ఆటగాళ్లు కొందరు మ్యాచ్ రెఫరీకి పిర్యాదు చేశారు. ఇక ప్రజెంటేషన్ కార్యక్రమం పూర్తైన కొద్దిసేటికే బంగ్లా క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో సిబ్బంది లంక బోర్డుకు ఫిర్యాదుచేశారు. బోర్డు అధికారులు విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు









