దేశాన్ని ఐక్యంగా ఉంచేది కాంగ్రెస్సే:రాహుల్
- March 16, 2018
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని ఐక్యంగా ఉంచగలదని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లగలదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న పార్టీ 84వ ప్లీనరీలో రాహుల్ మాట్లాడారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్కు ఇది తొలి ప్లీనరీ కావడం విశేషం. ప్రజల్లో బీజేపీ ద్వేషాన్ని నింపుతున్నదని, కాంగ్రెస్ పార్టీ ప్రేమను అందిస్తున్నదన్నారు. ఈ దేశం అందరిదన్న అభిప్రాయాన్ని వినిపించనున్నట్లు ఆయన తెలిపారు. అందరి లాభం కోసమే కాంగ్రెస్ ఏదైనా చేస్తుందన్నారు. దేశంలో అసహనం పెరుగుతోందన్నారు. ఈ ప్లీనరీ ద్వారా పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ భావిస్తున్నారు. బీజేపీ పాలనతో దేశం చాలా అలసిపోయిందని, ఓ కొత్త దిశానిర్దేశం కావాలని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని మునుముందుకు తీసుకువెళ్లగలదని రాహుల్ అన్నారు.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







