దేశాన్ని ఐక్యంగా ఉంచేది కాంగ్రెస్సే:రాహుల్
- March 16, 2018
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని ఐక్యంగా ఉంచగలదని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లగలదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న పార్టీ 84వ ప్లీనరీలో రాహుల్ మాట్లాడారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్కు ఇది తొలి ప్లీనరీ కావడం విశేషం. ప్రజల్లో బీజేపీ ద్వేషాన్ని నింపుతున్నదని, కాంగ్రెస్ పార్టీ ప్రేమను అందిస్తున్నదన్నారు. ఈ దేశం అందరిదన్న అభిప్రాయాన్ని వినిపించనున్నట్లు ఆయన తెలిపారు. అందరి లాభం కోసమే కాంగ్రెస్ ఏదైనా చేస్తుందన్నారు. దేశంలో అసహనం పెరుగుతోందన్నారు. ఈ ప్లీనరీ ద్వారా పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ భావిస్తున్నారు. బీజేపీ పాలనతో దేశం చాలా అలసిపోయిందని, ఓ కొత్త దిశానిర్దేశం కావాలని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని మునుముందుకు తీసుకువెళ్లగలదని రాహుల్ అన్నారు.
తాజా వార్తలు
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!









