సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వరూపం 2..
- March 16, 2018
కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విశ్వరూపం 2. విశ్వరూపం చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. కొన్నాళ్ళు అటకెక్కిన ఈ ప్రాజెక్ట్ ఈ మధ్య పోస్ట్ ప్రొడక్షన్స్, డబ్బింగ్ పనులు శరవేగంగా జరుపుకుంది. యూఎస్ లో ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తైనట్టు తెలుస్తుంది. జూన్ లో మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న విశ్వరూపం 2 చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విశ్వరూపం చిత్రంలో అవినీతితో పాటు కొన్ని సంఘటనలకి సంబంధించిన సీన్స్ అభిమానులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి. ఇండియాలోనే కాదు విదేశాలలోను విశ్వరూపం 2 మూవీపై భారీ ఆసక్తి నెలకొంది. త్వరలోనే చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









