వేలానికి అలనాటి నటి శ్రీవిద్య ఇల్లు
- March 17, 2018
అలనాటి నటి శ్రీవిద్య ఇంటిని వేలం వేస్తున్నట్టు ప్రకటించారు ఆదాయ పన్ను శాఖా అధికారులు. శ్రీవిద్యకు చెన్నై, అభిరామపురంలోని సుబ్రమణియంపురం వీధిలో రెండు అంతస్తుల ఫ్లాట్ ఉంది. 2006 లో శ్రీవిద్య అనారోగ్యంతో మరణించారు. దాంతో అప్పటినుంచి ఆ ఇంటిని ఆమె సన్నిహితులు అద్దెకు ఇచ్చారు. ఈ క్రమంలో ఇంటికి కొద్దీ సంవత్సరాలుగా పన్ను చెల్లించడం లేదు.పైగా పన్నుతోపాటు దాని వల్ల వచ్చిన వడ్డీ ఎక్కువ అయింది. పన్ను కట్టమని అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. శ్రీవిద్య సన్నిహితుల నుంచి ఎంతకీ స్పందన రాకపోవడంతో ఇంటిని వేలం వేయాలని నిర్ణయించారు 1,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆ ఫ్లాట్ను అధికారులు రూ.1,17,20,000గా ధరగా నిర్ణయించారు. కాగా శ్రీవిద్య తమిళ , మలయాళం తోపాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







