వేలానికి అలనాటి నటి శ్రీవిద్య ఇల్లు
- March 17, 2018
అలనాటి నటి శ్రీవిద్య ఇంటిని వేలం వేస్తున్నట్టు ప్రకటించారు ఆదాయ పన్ను శాఖా అధికారులు. శ్రీవిద్యకు చెన్నై, అభిరామపురంలోని సుబ్రమణియంపురం వీధిలో రెండు అంతస్తుల ఫ్లాట్ ఉంది. 2006 లో శ్రీవిద్య అనారోగ్యంతో మరణించారు. దాంతో అప్పటినుంచి ఆ ఇంటిని ఆమె సన్నిహితులు అద్దెకు ఇచ్చారు. ఈ క్రమంలో ఇంటికి కొద్దీ సంవత్సరాలుగా పన్ను చెల్లించడం లేదు.పైగా పన్నుతోపాటు దాని వల్ల వచ్చిన వడ్డీ ఎక్కువ అయింది. పన్ను కట్టమని అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. శ్రీవిద్య సన్నిహితుల నుంచి ఎంతకీ స్పందన రాకపోవడంతో ఇంటిని వేలం వేయాలని నిర్ణయించారు 1,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆ ఫ్లాట్ను అధికారులు రూ.1,17,20,000గా ధరగా నిర్ణయించారు. కాగా శ్రీవిద్య తమిళ , మలయాళం తోపాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించారు.
తాజా వార్తలు
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!









