వేలానికి అలనాటి నటి శ్రీవిద్య ఇల్లు
- March 17, 2018
అలనాటి నటి శ్రీవిద్య ఇంటిని వేలం వేస్తున్నట్టు ప్రకటించారు ఆదాయ పన్ను శాఖా అధికారులు. శ్రీవిద్యకు చెన్నై, అభిరామపురంలోని సుబ్రమణియంపురం వీధిలో రెండు అంతస్తుల ఫ్లాట్ ఉంది. 2006 లో శ్రీవిద్య అనారోగ్యంతో మరణించారు. దాంతో అప్పటినుంచి ఆ ఇంటిని ఆమె సన్నిహితులు అద్దెకు ఇచ్చారు. ఈ క్రమంలో ఇంటికి కొద్దీ సంవత్సరాలుగా పన్ను చెల్లించడం లేదు.పైగా పన్నుతోపాటు దాని వల్ల వచ్చిన వడ్డీ ఎక్కువ అయింది. పన్ను కట్టమని అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. శ్రీవిద్య సన్నిహితుల నుంచి ఎంతకీ స్పందన రాకపోవడంతో ఇంటిని వేలం వేయాలని నిర్ణయించారు 1,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆ ఫ్లాట్ను అధికారులు రూ.1,17,20,000గా ధరగా నిర్ణయించారు. కాగా శ్రీవిద్య తమిళ , మలయాళం తోపాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







