యూఏఈ నుంచి ఇతర దేశాలకు డబ్బు పంపితే, ఆ నగదు బదిలీకి ఫీజు చెల్లించాలి
- March 17, 2018
అబుదాబి, యూఏఈలో అతిపెద్ద బ్యాంకైన ఎమిరేట్స్ ఎన్బీడీ ప్రవాసీయులకు మింగుడుపడని వార్త తెలిపింది ఇకపై విదేశాలకు యూఏఈ కరెన్సీని ఉపయోగించి బదిలీ చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. యూఏఈ కరెన్సీలో చెల్లింపులు చేసేవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డుల ద్వారా దిర్హమ్స్లో చెల్లింపులు చేసేవారు 1.15 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. యూఏఈ కరెన్సీని ఉపయోగించి అంతర్జాతీయ వాణిజ్య వెబ్సైట్ల ద్వారా వస్తువులను కొనుగోలు చేయడం, విదేశీ ప్రయాణాలు చేయడం వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుందని, ఈ కారణంగానే ఫీజు చెల్లించాలనే నిబంధన ప్రవేశపెట్టామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. స్థానిక కరెన్సీ ద్వారా వస్తువుల కొనుగోలు, వీదేశీయానాలు చేయడం మంచిదని తమ వినియోగదారులకు అధికారులు సూచించారు. యూఏఈ కరెన్సీ ఉపయోగించి లావాదేవీలు జరపడం సులభంగా అనిపించినప్పటికీ ఖర్చుతో కూడుకున్న పనని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









