యూఏఈ నుంచి ఇతర దేశాలకు డబ్బు పంపితే, ఆ నగదు బదిలీకి ఫీజు చెల్లించాలి
- March 17, 2018
అబుదాబి, యూఏఈలో అతిపెద్ద బ్యాంకైన ఎమిరేట్స్ ఎన్బీడీ ప్రవాసీయులకు మింగుడుపడని వార్త తెలిపింది ఇకపై విదేశాలకు యూఏఈ కరెన్సీని ఉపయోగించి బదిలీ చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. యూఏఈ కరెన్సీలో చెల్లింపులు చేసేవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డుల ద్వారా దిర్హమ్స్లో చెల్లింపులు చేసేవారు 1.15 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. యూఏఈ కరెన్సీని ఉపయోగించి అంతర్జాతీయ వాణిజ్య వెబ్సైట్ల ద్వారా వస్తువులను కొనుగోలు చేయడం, విదేశీ ప్రయాణాలు చేయడం వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుందని, ఈ కారణంగానే ఫీజు చెల్లించాలనే నిబంధన ప్రవేశపెట్టామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. స్థానిక కరెన్సీ ద్వారా వస్తువుల కొనుగోలు, వీదేశీయానాలు చేయడం మంచిదని తమ వినియోగదారులకు అధికారులు సూచించారు. యూఏఈ కరెన్సీ ఉపయోగించి లావాదేవీలు జరపడం సులభంగా అనిపించినప్పటికీ ఖర్చుతో కూడుకున్న పనని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







