ఇంట్లోకి దూసుకెళ్ళిన విమానం, 10 మంది మృతి
- March 18, 2018
ఫిలిప్పీన్స్లో ఓ విమానం టేకాపైన కొద్దిసేపట్లోకి ప్రమాదానికి గురైంది. విమానం అదుపుతప్పి ఇంట్లోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో సుమారు పది మంది మృత్యువాత పడ్డారు. ఫిలిప్పీన్స్లో ఓ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది. శనివారం ఈ ఘటన చోటు చేసుకొంది. పీపర్ -23 అపాచీ విమానం బులాకన్ ప్రావిన్స్లోని ప్లారిడెల్ పట్టణంలోని విమానాశ్రయం నుండి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానం అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది.
దీంతో విమానంలోని ఐదుగురితో పాటు ఇంట్లోని ఐదుగురు మృత్యువాత పడ్డారని అధికారులు ప్రకటించారు. ఇంట్లోకి విమానం దూసుకెళ్ళిన వెంటనే విమానం దగ్దమైంది దీంతో మంటలు వ్యాపించాయి.
ఆరుగురు వ్యక్తులు ప్రయాణించే వీలున్న ఈ విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగుు ప్రయాణం చేస్తున్నారు అయితే విమానంలోని ఐదుగురు అక్కడి కక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు ఇంట్లోకి దూసుకెళ్ళడానికి ముందే విమానం విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.దీంతో విమానం అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్ళిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







