అల్కౌజ్లోని వేర్హోస్లో పేలుడు
- December 01, 2015
దుబాయ్లోని అల్కౌజ్లోగల ఓ వేర్ హౌస్లో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది.ఈ పేలుడుతో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడినవారంతాఆసియా కార్మికులుగా గుర్తించారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమించింది.వారిని హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. యంత్రాలను వుంచేందుకు వేర్హౌస్నికొన్నాళ్ళుగా వినియోగిస్తున్నారు. పేలుడుకు గల కారణాల్ని అన్వేషించేందుకు ఫోరెన్సిక్నిపుణుల్ని రంగంలోకి దించారు. ప్రమాదంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, విచారణలోతుగా సాగుతోందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ప్రమాద సమయంలోనలుగురు కార్మికులు ఆ వేర్హౌస్లో పనిచేస్తున్నట్లు వారు చెప్పారు. ఇప్పటివరకూఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, తీవ్ర గాయాలపాలైనవారిని ఎయిర్ అంబులెన్స్లోఆసుపత్రికి తరలించామనీ, మొత్తం నలుగురికీ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందనిఅన్నారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









