సిమ్లా:లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 20 మంది విద్యార్థులు మృతి
- April 09, 2018
సిమ్లా:హిమచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా సర్పూర్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 40మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 60 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. సహాయక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా కొంత మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







