సిమ్లా:లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 20 మంది విద్యార్థులు మృతి

- April 09, 2018 , by Maagulf
సిమ్లా:లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 20 మంది విద్యార్థులు మృతి

సిమ్లా:హిమచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా సర్పూర్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 40మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 60 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. సహాయక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా కొంత మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com