దుబాయ్ - అబుదాబీ: ఆర్టిఎ లగ్జరీ బస్ ఫ్లీట్
- April 09, 2018
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, దుబాయ్ - అబుదాబీ మధ్య ప్రయాణీకుల కోసం లగ్జరీ బస్సుల్ని ప్రారంభించనుస్త్రంది. వాల్వో కోచెస్, వచ్చే ఏడాదిలో ప్రారంభిస్తామనీ, హై ఎండ్ ఫీచర్స్ వీటిల్లో వుంటాయని అధికారులు తెలిపారు. రూమీ సీట్స్, ఫ్రీ ఇంటర్నెట్, యూఎస్బీ పోర్టల్స్ (ఫోన్ ఛార్జింగ్ కోసం), ఫుట్ రెస్ట్స్, కప్ హోల్డర్స్ ఈ బస్సులో అదనపు సౌకర్యాలు. హైడ్రాలిక్ లిఫ్ట్ కారణంగా ప్రయాణీకులకు అత్యంత సౌకర్యవంతంగా వుండనున్నాయి ఈ బస్సులు. మెనా రీజియన్లో ఈ తరహా బస్సుల్ని తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. 465 మిలియన్ దిర్హామ్ల ప్రోగ్రామ్లో భాగంగా మొత్తం 316 బస్సులు రావాల్సి వుండగా, మొదట 143 కోచ్లు అందుబాటులోకి వస్తాయి. 2019 నాటికి ఈ సంఖ్య 2085కి చేరుతుంది. దుబాయ్లో మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్, డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









