'మస్కట్ తెలుగు కళా సమితి' ఘనంగా నిర్వహించిన ఉగాది ఉత్సవం
- April 11, 2018_1523469829.jpg)
మస్కట్:ఉగాది పండుగను పురస్కరించుకొని , మస్కట్ తెలుగు కళాసమితి (ఇండియన్ సోషల్ క్లబ్ తెలుగు విభాగం) ఉగాది ఉత్సవాన్ని అద్భుతంగా, కనులపండువగా హయ్యర్ కాలేజీ అఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో నిర్వహించారు.
ఈ ఉగాది ఉత్సవానికి ప్రముఖ కవి మరియు సినీ పాటల రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు మరియు అరుదైన ఈలపాటతో సంగీతాన్ని అందించే శ్రీ శివప్రసాద్ గారు పాల్గొని తెలుగు కళాసమితి సభ్యులను రంజింపచేశారు.
కార్యక్రమంలో ముందుగా ఒమాన్ దేశపు గీతాన్ని మరియు తెలుగు కళాసమితి నిర్వహిస్తున్న తెలుగు తరగతుల విద్యార్థులు ఆలపించిన జాతీయ గీతాన్ని, రెండు తెలుగు రాష్ట్రాల గీతాలను వినిపించారు.
తెలుగు కళాసమితి కార్యవర్గ సభ్యుల సతీమణులు చేసిన దీప ప్రజ్వలన తర్వాత పంచాంగ శ్రవణాన్ని వేదపండితులు శ్రీ విజయకుమార్ గారు వినిపించారు. తర్వాత తెలుగు ఆడపిల్లలు చేసిన ఉగాది మరియు ఇతర నృత్య ప్రదర్శనలు సభ్యులను ఆకట్టుకొన్నాయి.
శ్రీ జొన్నవిత్తుల గారు తనదైన ప్రత్యేక శైలిలో పేరడీ పాటలను, తెలుగు సాహిత్య ఝరిని అందించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తదుపరి శ్రీ శివప్రసాద్ గారు ఈలపాటతో అనేక త్యాగరాజ, అన్నమయ్య, పురందరదాసు మరియు ఇతర కీర్తనలతో సభ్యులను సమ్మోహనపరిచారు. శ్రీ శివప్రసాద్ గారి ఈలపాటకు వాద్యసహకారాన్ని శ్రీ రఘురాం.హరి మృదంగంతో, శ్రీ రామకృష్ణ కంజీరాతో, శ్రీమతి వాణి భట్ గారు వయోలిన్ తో అందించారు.
ఈ సందర్భంగా అనేక సామజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్, హైద్రాబాద్, ప్రతినిధిగా విచ్చేసిన శ్రీమతి పద్మావతి గారిని, శ్రీ జొన్నవిత్తుల గారిని, శ్రీ శివ ప్రసాద్ గారిని, వాయిద్య కళాకారులను ఉగాది పురస్కారాలతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన భారత దేశ రాయబారి శ్రీ ఇంద్రమణి పాండే గారు సత్కరించారు. భారత రాయబార కార్యాలయ ఉద్యోగిని శ్రీమతి నీలూ రోరా విశేష అతిధిగా విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించారు.
ఈ ఉగాది ఉత్సవాన్ని నిర్వహించటానికి సిరి సంపద రియల్ ఎస్టేట్, హైదరాబాద్, భూమాత రియల్ ఎస్టేట్, విశాఖపట్నం, మోడర్న్ ఎక్స్చేంజి, మస్కట్ ఫార్మసీ, ఉదయ్ ఖిమ్జీ మరియు మస్కట్ ఒయాసిస్ వారు సౌజన్యాన్ని అందించారు.
అనేకమంది సభ్యులు హాజరైన ఈ ఉగాది ఉత్సవ కార్యక్రమంలో సభ్యులకు ఉగాది పచ్చడి తో పాటు, సంగీత సాహిత్య సమ్మేళనాన్నిఆత్యత్భుతంగా అందించి మస్కట్ తెలుగు కళా సమితి ఉగాది ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్బంగా అనిల్ కుమార్ అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగుకళాసమితి ఎన్నొ వివిదమైనా కార్యక్రమలతొ అలరించండమె కాకుండా , కళలను పొషించడము మరియు సమాజిక కార్యక్రమములు చెయ్యడములొ ఓమాన్లొ మెము ముందుటాము అని మరియు కార్యవర్గం మీకు అందుబాటులొ ఉంటారని, విఛ్చెసిన అతిదులందరికి ధన్యవాదములు తెలిపారు.
_1523469814.jpg)
_1523469792.jpg)
_1523469779.jpg)
_1523469767.jpg)
_1523469753.jpg)
_1523467277.jpg)
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









