బెజవాడలో బైక్ క్యాబ్లు
- April 15, 2018
విజయవాడ: మీరు త్వరగా రైల్వేస్టేషన్కు వెళ్లాలా? కళాశాలకు ట్కెం అయిపోతుందా? చరవాణిలో ఒక్క క్లిక్ కొట్టండి.. నిముషాల్లో ద్విచక్రవాహనం మీముందుంటుంది. నిర్ణీత సమయానికి మిమ్మల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది. ద్విచక్రవాహన క్యాబ్లు ఇప్పుడు నూతన ఒరవడి సృష్టిస్తున్నాయి. విజయవాడలో ర్యాపిడో సంస్థ ద్విచక్రవాహనాల క్యాబ్లకు శ్రీకారం చుట్టింది. నవ్యాంధ్రలో ప్రజల జీవన విధానం మారుతోంది. కార్లు, ఆటోలతో పాటు ద్విచక్రవాహనాలు క్యాబ్లుగా మారుతున్నాయి. అతి తక్కువ ఖర్చుతో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిమిషాల్లో చేరుస్తామంటూ దూసుకుపోతున్నారు బైక్ క్యాబ్ రైడర్స్. ర్యాపిడో సంస్థ బెంగళూరు కేంద్రంగా విజయవాడలో బైక్ క్యాబ్ సేవలందింస్తోంది. ఇప్పటికే 250 మంది వాహనదారులు డ్క్రెవర్లుగా పేర్లు నమోదు చేసుకోగా.. ప్రస్తుతం 100 మందితో క్యాబ్ సేవలను ప్రారంభించారు. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు బైక్ క్యాబ్ సేవలు అందుబాటులో ఉంటాయి. నగరంలో 20 కిలోమీటర్ల పరిధి వరకు ఈ సేవలను అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







