అమెరికాలో మంచు తుపాను బీభత్సం..
- April 16, 2018
విపరీతంగా కురుస్తున్న మంచు వర్షానికి అమెరికా వణికిపోతోంది. రోడ్లపై అడుగుల మేర పేరుకుపోయిన మంచుతో పలుచోట్ల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. విపరీతమైన చలిగాలులతోపాటు వడగళ్ల వాన కురుస్తుండడంతో జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. మిన్నియాపోలీస్లో 38 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. నాలుగు రోజులుగా అక్కడ ఇదే వాతావరణం కొనసాగుతోంది. సౌత్ డకోటాలోనూ 35 సెంటీమీటర్ల మంచు పడింది. మిడ్ వెస్ట్లో మరికొన్ని ప్రాంతాల్లోనూ చలికి జనం గడ్డకట్టుకుపోతున్నారు. ఏప్రిల్ నెలలో ఈ స్థాయిలో మంచు కురవడం గతంలో ఎప్పుడూ లేదు. విస్కాన్సిన్, గ్రీన్బే ప్రాంతాల్లో గంటల వ్యవధిలోనే 60 సెంటీమీటర్ల మంచు కురవడంతో ఇళ్లు, వాహనాలు అందులో కూరుకుపోయినట్టే అయిపోయాయి.
విపరీతమైన మంచు తుఫాన్ కారణంగా విద్యుత్ సరఫరాకి కూడా ఆటంకం ఏర్పడుతోంది. పెన్సిల్వేనియా, వర్జీనియాల్లోనూ 20 సెంటీమీటర్ల మేర మంచు జనావాసాలను ముంచేసింది. ఇండియానా, మిచిగాన్, మిన్నిసోటాల్లోనూ మంచు కురుస్తున్నా అది ప్రమాదకరస్థాయిలో లేదు. మిన్నియాపోలీస్లో సహా మంచు తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రోడ్లపై పేరుకుపోయిన మంచు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి.
మిడ్వెస్ట్ను మంచు ముంచెత్తితే.. వర్జీనియా రాష్ట్రంలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీవర్షాలు, ఈదురు గాలులతో భారీ నష్టం వాటిల్లింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వందలాది ఇళ్లు డేమేజ్ అయ్యాయి. వర్జీనియా గవర్నర్ అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. టోర్నడోల ఎఫెక్ట్తో న్యూయార్క్కి కూడా ముప్పు పొంచి ఉన్నట్టు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







