ఉత్తర కొరియా నేతతో సిఐఎ డైరెక్టర్ రహస్య భేటీ
- April 18, 2018వాషింగ్టన్ : ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్తో ఈ నెల్లో సిఐఎ డైరెక్టర్ మైక్ పాంపియో రహస్య సమావేశం జరిపారు. దాదాపు రెండు దశాబ్దాల కాలంలో రెండు దేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం ఇదేనని భావిస్తున్నట్లు అమెరికా మీడియా వ్యాఖ్యానించింది. ఏప్రిల్ 1వ తేది ఆదివారం పాంపియో ఉత్తర కొరియా వెళ్ళినట్లు తెలుస్తోంది. అమెరికా, ఉత్తర కొరియా నేతల మధ్య జరగనున్న శిఖరాగ్ర సదస్సుపై చర్చించేందుకే ఈ పర్యటన జరిగినట్లు తెలుస్తోందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఉత్తర కొరియాతో చాలా అత్యున్నత స్థాయిలో అమెరికా ప్రత్యక్ష చర్చలను జరుపుతోందని మంగళవారం నాడు ట్రంప్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!