అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే: చైనా
- April 18, 2018బీజింగ్ : దక్షిణప్రాంత దీవి హైనన్కు వీసా లేకుండా ప్రయాణం చేసేందుకు చైనా అనుమతించింది. ఈ ప్రాంతంలో పర్యటించేందుకు అందరికీ అవకాశాలు కల్పించేలా అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా చైనా ఒక అడుగు ముందుకేసింది. మే నెల్లో ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. 59దేశాలకు చెందిన పర్యాటకులు 30 రోజుల పాటు హైనన్ దీవిలో వీసా లేకుండా పర్యటించవచ్చునని స్టేట్ ఇమ్మిగ్రేషన్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ క్యూ యున్హాయి ఇక్కడ ఒక పత్రికా సమావేశంలో తెలిపారు. రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాలతో సహా పలు దేశాల వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. స్వేచ్ఛా వాణిజ్య మండలంగా ఈ దీవిని తయారుచేసేందుకు, చైనా పారదర్శకతకు ఒక నమూనాగా తీర్చిదిద్దే చర్యల్లో భాగమే ఇదని ఆయన పేర్కొన్నారు. హైనన్ దీవిలో గుర్రపు పందాలు వృద్ధిచేస్తామని, క్రీడలకు సంబంధించి కొత్త తరహా లాటరీలు ప్రవేశపెడతామని, అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తామని చైనా ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!