ఉత్తర కొరియా నేతతో సిఐఎ డైరెక్టర్ రహస్య భేటీ
- April 18, 2018వాషింగ్టన్ : ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్తో ఈ నెల్లో సిఐఎ డైరెక్టర్ మైక్ పాంపియో రహస్య సమావేశం జరిపారు. దాదాపు రెండు దశాబ్దాల కాలంలో రెండు దేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం ఇదేనని భావిస్తున్నట్లు అమెరికా మీడియా వ్యాఖ్యానించింది. ఏప్రిల్ 1వ తేది ఆదివారం పాంపియో ఉత్తర కొరియా వెళ్ళినట్లు తెలుస్తోంది. అమెరికా, ఉత్తర కొరియా నేతల మధ్య జరగనున్న శిఖరాగ్ర సదస్సుపై చర్చించేందుకే ఈ పర్యటన జరిగినట్లు తెలుస్తోందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఉత్తర కొరియాతో చాలా అత్యున్నత స్థాయిలో అమెరికా ప్రత్యక్ష చర్చలను జరుపుతోందని మంగళవారం నాడు ట్రంప్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!