అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే: చైనా
- April 18, 2018బీజింగ్ : దక్షిణప్రాంత దీవి హైనన్కు వీసా లేకుండా ప్రయాణం చేసేందుకు చైనా అనుమతించింది. ఈ ప్రాంతంలో పర్యటించేందుకు అందరికీ అవకాశాలు కల్పించేలా అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా చైనా ఒక అడుగు ముందుకేసింది. మే నెల్లో ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. 59దేశాలకు చెందిన పర్యాటకులు 30 రోజుల పాటు హైనన్ దీవిలో వీసా లేకుండా పర్యటించవచ్చునని స్టేట్ ఇమ్మిగ్రేషన్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ క్యూ యున్హాయి ఇక్కడ ఒక పత్రికా సమావేశంలో తెలిపారు. రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దేశాలతో సహా పలు దేశాల వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. స్వేచ్ఛా వాణిజ్య మండలంగా ఈ దీవిని తయారుచేసేందుకు, చైనా పారదర్శకతకు ఒక నమూనాగా తీర్చిదిద్దే చర్యల్లో భాగమే ఇదని ఆయన పేర్కొన్నారు. హైనన్ దీవిలో గుర్రపు పందాలు వృద్ధిచేస్తామని, క్రీడలకు సంబంధించి కొత్త తరహా లాటరీలు ప్రవేశపెడతామని, అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తామని చైనా ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!