ఉత్తర కొరియా నేతతో సిఐఎ డైరెక్టర్ రహస్య భేటీ
- April 18, 2018
వాషింగ్టన్ : ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్తో ఈ నెల్లో సిఐఎ డైరెక్టర్ మైక్ పాంపియో రహస్య సమావేశం జరిపారు. దాదాపు రెండు దశాబ్దాల కాలంలో రెండు దేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం ఇదేనని భావిస్తున్నట్లు అమెరికా మీడియా వ్యాఖ్యానించింది. ఏప్రిల్ 1వ తేది ఆదివారం పాంపియో ఉత్తర కొరియా వెళ్ళినట్లు తెలుస్తోంది. అమెరికా, ఉత్తర కొరియా నేతల మధ్య జరగనున్న శిఖరాగ్ర సదస్సుపై చర్చించేందుకే ఈ పర్యటన జరిగినట్లు తెలుస్తోందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఉత్తర కొరియాతో చాలా అత్యున్నత స్థాయిలో అమెరికా ప్రత్యక్ష చర్చలను జరుపుతోందని మంగళవారం నాడు ట్రంప్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









