మౌనం వీడాలని మోదీకి మన్మోహన్ చురక

- April 18, 2018 , by Maagulf
మౌనం వీడాలని మోదీకి మన్మోహన్ చురక

మౌనం వీడి మాట్లాడాని ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సూచించారు. 'నేను మాట్లాడటం లేదని నన్ను 'మౌన్‌ మోహన్‌ సింగ్‌'గా సంబోధించారు. మాట్లాడటం నేర్చుకోవాలని నాకు సలహా ఇచ్చారు. ఇప్పుడు అదే మౌన సూత్రాన్ని మోదీ పాటిస్తున్నారు. అప్పుడు నాకిచ్చిన సలహానే ఇప్పుడు మీరు పాటించండి. దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న అంశాలపై మీరెందుకు మౌనం వహిస్తున్నారు? అత్యాచార ఘటనలపై నోరు విప్పరేం? మీరు ఒక ప్రధాని హోదాలో ఉన్నారన్న విషయం మర్చిపోయినట్లున్నారు' అని మన్మోహన్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com