300 మందికి శిక్షలు విధించిన ఇరాక్
- April 18, 2018
ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాల అడ్డుకట్టకు ఆ దేశ ప్రభుత్వం పూనుకుంది. ఇస్లామిక్ స్టేట్కు సహకరించిన వారికి ఇరాక్ ప్రభుత్వం కఠిన శిక్షలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో 300మందికి శిక్షలు విధించింది. వారిలో విదేశీయులు, మహిళలు కూడా ఉన్నారు. ఉగ్రవాద సంస్థతో పనిచేస్తున్నారన్న ఆరోపణలపై కొంతమందిని మోసుల్, దేశ రాజధాని నగరం బాగ్దాద్లోని న్యాయస్థానాల్లో విచారణ నిర్వహించినట్లు న్యాయనిపుణులు వెల్లడించారు. వారికి శిక్షలు విధించినట్లు తెలిపారు. కాగా, అనుమానితులను శిక్షిస్తున్న నేపథ్యంలో ఇరాక్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని హ్యూమన్ రైట్స్ వాచ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇలా శిక్షలు విధించడం వల్ల అమాయకులు చనిపోవడంతో పాటు బాధితులకు సరైన న్యాయం అందదని ఆ సంస్థ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







