300 మందికి శిక్షలు విధించిన ఇరాక్
- April 18, 2018
ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాల అడ్డుకట్టకు ఆ దేశ ప్రభుత్వం పూనుకుంది. ఇస్లామిక్ స్టేట్కు సహకరించిన వారికి ఇరాక్ ప్రభుత్వం కఠిన శిక్షలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో 300మందికి శిక్షలు విధించింది. వారిలో విదేశీయులు, మహిళలు కూడా ఉన్నారు. ఉగ్రవాద సంస్థతో పనిచేస్తున్నారన్న ఆరోపణలపై కొంతమందిని మోసుల్, దేశ రాజధాని నగరం బాగ్దాద్లోని న్యాయస్థానాల్లో విచారణ నిర్వహించినట్లు న్యాయనిపుణులు వెల్లడించారు. వారికి శిక్షలు విధించినట్లు తెలిపారు. కాగా, అనుమానితులను శిక్షిస్తున్న నేపథ్యంలో ఇరాక్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని హ్యూమన్ రైట్స్ వాచ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇలా శిక్షలు విధించడం వల్ల అమాయకులు చనిపోవడంతో పాటు బాధితులకు సరైన న్యాయం అందదని ఆ సంస్థ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









