కథువా ఘటనలో పక్కా ఆధారాలు లభ్యం

- April 20, 2018 , by Maagulf
కథువా ఘటనలో పక్కా ఆధారాలు లభ్యం

కథువా అత్యాచారం కేసులో జమ్మూ కశ్మీర్ సిట్ అధికారులు నిందితులకు సంబంధించిన పక్కా ఆధారాలు సేకరించారు. ఆలయం వద్ద సేకరించిన రక్త నమూనాలు బాధితురాలివేనని ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్‌ తేల్చింది. నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారనీ, గుడిలోనే ఈ అఘాయిత్యం జరిగినట్టు రుజువైందని అధికారులు తెలిపారు. ఆలయంలో సేకరించిన తలవెంట్రుకలు నిందితుడు శుభమ్ సంగ్రా డీఎన్ఏతో సరిపోలినట్టు తెలిపారు. ఆధారాలను తుడిచిపెట్టేందుకు అతడు బాధితురాలి దుస్తులను శుభ్రం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com