లండన్, సింగపూర్లో ఎస్ బ్యాంకు బ్రాంచీలు
- April 20, 2018
న్యూఢిల్లీ : లండన్, సింగపూర్లో కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఆమోదం పొందినట్లు యస్ బ్యాంక్ శుక్రవారం వెల్లడించింది. దీనివల్ల బ్యాంక్ వ్యాపార సేవలు మరింత పుంజుకుంటాయని, ఎన్ఆర్ఐ ఆర్థిక సేవలను విస్తరించడానికి దోహదపడుతుందని ఎమ్డి, సిఇఒ రాణా కపూర్ పేర్కొన్నారు. కీలకమైన ఆర్థిక, వాణిజ్య కేంద్రాల్లో ప్రతినిధుల కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో తమ అభివృద్ధికి, నిబద్ధతకు గుర్తింపు లభించినట్లయిందని ఆయన పేర్కొన్నారు. ఎస్ బ్యాంక్ మొదటి కార్యాలయాన్ని 2015 ఏప్రిల్ లో అబూ దాబీలో ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ యూనిట్ గిఫ్ట్ సిటీ పేరుతో గాంధీనగర్లో ప్రారంభించామని అన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!
- Dh100 మిలియన్ ఫండ్.. నాన్ ప్రాఫిట్ సెక్టర్ కు బూస్ట్..!!
- యూఏఈలో స్కూల్ బస్సు సర్వీసులు వాయిదా..!!
- ఖతార్ బ్యాంకుల మొత్తం ఆస్తులు QR 2.173 ట్రిలియన్లు..!!
- బహ్రెయిన్ లో 473,323మంది ప్రవాసులకు బీమా కవరేజీ..!!
- ఐదేళ్లలో 3,795 మంది కువైటీయేతర టీచర్ల తొలగింపు..!!









