లండన్, సింగపూర్లో ఎస్ బ్యాంకు బ్రాంచీలు
- April 20, 2018
న్యూఢిల్లీ : లండన్, సింగపూర్లో కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఆమోదం పొందినట్లు యస్ బ్యాంక్ శుక్రవారం వెల్లడించింది. దీనివల్ల బ్యాంక్ వ్యాపార సేవలు మరింత పుంజుకుంటాయని, ఎన్ఆర్ఐ ఆర్థిక సేవలను విస్తరించడానికి దోహదపడుతుందని ఎమ్డి, సిఇఒ రాణా కపూర్ పేర్కొన్నారు. కీలకమైన ఆర్థిక, వాణిజ్య కేంద్రాల్లో ప్రతినిధుల కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో తమ అభివృద్ధికి, నిబద్ధతకు గుర్తింపు లభించినట్లయిందని ఆయన పేర్కొన్నారు. ఎస్ బ్యాంక్ మొదటి కార్యాలయాన్ని 2015 ఏప్రిల్ లో అబూ దాబీలో ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ఐఎఫ్ఎస్సి బ్యాంకింగ్ యూనిట్ గిఫ్ట్ సిటీ పేరుతో గాంధీనగర్లో ప్రారంభించామని అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







