లండన్‌, సింగపూర్లో ఎస్‌ బ్యాంకు బ్రాంచీలు

- April 20, 2018 , by Maagulf
లండన్‌, సింగపూర్లో ఎస్‌ బ్యాంకు బ్రాంచీలు

న్యూఢిల్లీ : లండన్‌, సింగపూర్లో కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఆమోదం పొందినట్లు యస్‌ బ్యాంక్‌ శుక్రవారం వెల్లడించింది. దీనివల్ల బ్యాంక్‌ వ్యాపార సేవలు మరింత పుంజుకుంటాయని, ఎన్‌ఆర్‌ఐ ఆర్థిక సేవలను విస్తరించడానికి దోహదపడుతుందని ఎమ్‌డి, సిఇఒ రాణా కపూర్‌ పేర్కొన్నారు. కీలకమైన ఆర్థిక, వాణిజ్య కేంద్రాల్లో ప్రతినిధుల కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయ బ్యాంకింగ్‌ రంగంలో తమ అభివృద్ధికి, నిబద్ధతకు గుర్తింపు లభించినట్లయిందని ఆయన పేర్కొన్నారు. ఎస్‌ బ్యాంక్‌ మొదటి కార్యాలయాన్ని 2015 ఏప్రిల్‌ లో అబూ దాబీలో ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ఐఎఫ్‌ఎస్‌సి బ్యాంకింగ్‌ యూనిట్‌ గిఫ్ట్‌ సిటీ పేరుతో గాంధీనగర్‌లో ప్రారంభించామని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com