'ఐపీఎల్' అభిమానులకోసం ఉచిత రైలు
- April 20, 2018
చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ కావేరీ జలాల వివాదం కారణంగా పూణేకు మార్చారు. ఈ విషయాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మాక్కూడా మ్యాచ్ చూసే ఏర్పాట్లు ఏదైనా చేయండంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని కోరారు. వారి కోరిక మేరకు సీఈవో కాశీ విశ్వనాథన్ ఫాన్స్ క్లబ్ సభ్యులను ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి పూణేకు తీసుకువెళ్లడానికి నిర్ణయించింది. విజిల్ పోడు ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టి మ్యాచ్ టికెట్లతో పాటు, భోజనం వసతి కూడా ఉచితంగానే కల్పించే ఏర్పాట్లు చేసింది. శుక్రవారం పూణేలో రాజస్తాన్ రాయల్స్తో చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ అభిమానులకు కనువిందుచేయనుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్కి ఇలాంటి ఏర్పాట్లు చేయడం కష్టం అని తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







