'మహానటి' లో 'మూగ మనసులు' పాట ..
- April 21, 2018
కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన మహానటి టీజర్ రిలీజై అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా తొలి పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'మూగ మనసులు.. మన్ను మిన్ను కలుసుకున్న సీమలో' అనే సిరివెన్నల సీతారామ శాస్త్రి గీతం ఆకట్టుకుంటోంది. మిక్కీ జే. మేయర్ సంగీతాన్ని అందించిన ఈ గీతాన్ని శ్రేయా ఘోషల్, అనురాగ్ పాడారు. ఇక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ పాటకు అనుగుణంగా ఆడి పాడి అలరించారు. సెట్టింగ్స్ కూడా ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయి. మే 9న తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి అశ్వనీ దత్, కూతురు ప్రియాంకదత్ నిర్మాతలుగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయంలో అధునాతన ల్యాండింగ్ సదుపాయాలు!
- మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు..
- యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం
- ఏపీలో ప్రజల భద్రత కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ గుప్తా
- కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు చేపడుతున్నాం: హోం మంత్రి అనిత
- బుర్జుమాన్ మాల్ లో టిక్కెట్ లెస్ పార్కింగ్ సిస్టమ్..!!
- యూఏఈలో ప్రాథమిక ఉత్పత్తుల ధరల పెంపుపై మంత్రి క్లారిటీ..!!
- నాన్-ఆల్కహాలిక్ ఏల్ దుబాయ్లో ప్రారంభం..!!
- డ్రగ్స్ వినియోగం..మహిళకు పదేళ్ల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ జరిమానా..!!