'మహానటి' లో 'మూగ మనసులు' పాట ..
- April 21, 2018
కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన మహానటి టీజర్ రిలీజై అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా తొలి పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'మూగ మనసులు.. మన్ను మిన్ను కలుసుకున్న సీమలో' అనే సిరివెన్నల సీతారామ శాస్త్రి గీతం ఆకట్టుకుంటోంది. మిక్కీ జే. మేయర్ సంగీతాన్ని అందించిన ఈ గీతాన్ని శ్రేయా ఘోషల్, అనురాగ్ పాడారు. ఇక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ పాటకు అనుగుణంగా ఆడి పాడి అలరించారు. సెట్టింగ్స్ కూడా ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయి. మే 9న తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి అశ్వనీ దత్, కూతురు ప్రియాంకదత్ నిర్మాతలుగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







