దోమల అదుపునకు
- April 22, 2018వాషింగ్టన్: సాంకేతిక పరిజ్ఞానంతో మగ దోమలకు వంధ్యత్వం కల్గించి తద్వారా దోమల వ్యాప్తిని, వాటి వల్ల వస్తున్న వ్యాధులను నియంత్రించవచ్చని రుజువైంది. వివిధ వ్యాధులను వ్యాప్తి చేస్తున్న దోమలను నియంత్రించేందుకు వీలుగా దోమలను వాతారణంలోకి వదిలే ప్రక్రియను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ) విజయవంతంగా పరీక్షించింది. డ్రోన్ సహాయంతో ఆ దోమలను వాతావరణంలోకి అణు సాంకేతికతను వినియోగిస్తూ ప్రవేశపెడితే జికా, తదితర వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఎఇఎ, యుఎనఒలోని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఒ), వురు రోబోటిక్స్ అనే స్వచ్ఛంద సంస్థ గతేడాది వంధ్య క్రిమి సాంకేతికత ఆధారిత దోమలను వదిలే విధానానికి రూపకల్పన చేశాయి. దీన్ని గత నెల బ్రెజిల్లో విజయవంతంగా పరీక్షించారు. డ్రోన్లలో ఉంచే మగ దోమలకు రేడియేషన్తో పునరుత్పత్తి సామర్థ్యాన్ని దూరంచేసి వాతావరణంలోకి విడిచిపెడతారు. అనంతరం ఈ దోమలు ఆడ దోమలతో కలిసినప్పటికీ సంతానం కలగదు. దోమలు వ్యాప్తి చెందవంటున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు