దుమారం లేపుతున్న మోడీ వ్యాఖ్యలు..
- April 22, 2018కామన్ వెల్త్ దేశాధినేతల సదస్సులో పాల్గొనేందుకు గతవారం లండన్లో పర్యటించిన ప్రధాని మోడీ వైద్యుల గురించి చేసిన వ్యాఖ్యలపై తాజాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్లర్టు, ఫార్మా కంపెనీల మధ్య అక్రమ అవగాహన వల్లే.. వైద్యులు ఖరీదైన మందులను సిఫారసు చేస్తున్నట్టు ప్రధాని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. పేదలపై ఆర్ధికభారం పెరుగుతుందని చెప్పుకొచ్చారు.
అయితే మోడీ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని చేసిన వ్యాఖ్యలు భారతీయ వైద్యులను అప్రతిష్ఠపాలు చేసేవిధంగా ఉన్నాయని ఆక్షేపించింది. ఈ మేరకు ఐఎంఏ ప్రధానమంత్రికి లేఖరాసింది. వైద్యులు గనుక లేకపోతే దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని.. ప్రస్తుత పరిస్థితులతోపాటు ప్రభుత్వాల విధానాల వల్ల వైద్య వ్యవస్థలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నది. విదేశాల్లో భారతీయ వైద్యులపై బురదజల్లే విధంగా మాట్లాడటం సరికాదని తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ