దుమారం లేపుతున్న మోడీ వ్యాఖ్యలు..
- April 22, 2018
కామన్ వెల్త్ దేశాధినేతల సదస్సులో పాల్గొనేందుకు గతవారం లండన్లో పర్యటించిన ప్రధాని మోడీ వైద్యుల గురించి చేసిన వ్యాఖ్యలపై తాజాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్లర్టు, ఫార్మా కంపెనీల మధ్య అక్రమ అవగాహన వల్లే.. వైద్యులు ఖరీదైన మందులను సిఫారసు చేస్తున్నట్టు ప్రధాని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. పేదలపై ఆర్ధికభారం పెరుగుతుందని చెప్పుకొచ్చారు.
అయితే మోడీ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని చేసిన వ్యాఖ్యలు భారతీయ వైద్యులను అప్రతిష్ఠపాలు చేసేవిధంగా ఉన్నాయని ఆక్షేపించింది. ఈ మేరకు ఐఎంఏ ప్రధానమంత్రికి లేఖరాసింది. వైద్యులు గనుక లేకపోతే దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని.. ప్రస్తుత పరిస్థితులతోపాటు ప్రభుత్వాల విధానాల వల్ల వైద్య వ్యవస్థలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నది. విదేశాల్లో భారతీయ వైద్యులపై బురదజల్లే విధంగా మాట్లాడటం సరికాదని తెలిపింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









