దుమారం లేపుతున్న మోడీ వ్యాఖ్యలు..
- April 22, 2018
కామన్ వెల్త్ దేశాధినేతల సదస్సులో పాల్గొనేందుకు గతవారం లండన్లో పర్యటించిన ప్రధాని మోడీ వైద్యుల గురించి చేసిన వ్యాఖ్యలపై తాజాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్లర్టు, ఫార్మా కంపెనీల మధ్య అక్రమ అవగాహన వల్లే.. వైద్యులు ఖరీదైన మందులను సిఫారసు చేస్తున్నట్టు ప్రధాని ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. పేదలపై ఆర్ధికభారం పెరుగుతుందని చెప్పుకొచ్చారు.
అయితే మోడీ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని చేసిన వ్యాఖ్యలు భారతీయ వైద్యులను అప్రతిష్ఠపాలు చేసేవిధంగా ఉన్నాయని ఆక్షేపించింది. ఈ మేరకు ఐఎంఏ ప్రధానమంత్రికి లేఖరాసింది. వైద్యులు గనుక లేకపోతే దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని.. ప్రస్తుత పరిస్థితులతోపాటు ప్రభుత్వాల విధానాల వల్ల వైద్య వ్యవస్థలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నది. విదేశాల్లో భారతీయ వైద్యులపై బురదజల్లే విధంగా మాట్లాడటం సరికాదని తెలిపింది.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









