అబుదాబీ:22 మంది డ్రగ్ పెడ్లర్స్ అరెస్ట్
- April 24, 2018
అబుదాబీ:అబుదాబీలో 22 మంది ఆసియా జాతీయుల్ని డ్రగ్స్ పెడ్లింగ్ కేసులో అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 20 కిలోల నార్కోటిక్స్ని స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్, క్రిస్టల్ డ్రగ్స్ వారి వద్ద లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ రాకెట్కి సంబంధించిన సూత్రధారిని కూడా గుర్తించారు. ఆసియాకి చెందినవారిగా నిందితుల్ని పేర్కొన్నారు అధికారులు. డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ కల్నల్ తాహెర్ ఘరీబ్ అల్ దహెరి మాట్లాడుతూ, సీక్రెట్ ఆపరేషన్ ద్వారా నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. గ్రూపులుగా విడిపోయి, డ్రగ్స్ని విక్రయిస్తున్నట్లు గుర్తించి, పక్కా ప్లాన్తో వారిని అరెస్ట్ చేశామన్నారు. డ్రగ్స్ పట్ల అవగాహనా కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా చేపట్టాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









