ఖతార్లో సందడి చేయనున్న షారుక్
- April 25, 2018
దోహా: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ఖాన్ ఖతార్లో సందడి చేయనున్నారు. ఏప్రిల్ 26న ఆయన దోహాలోని ఓ జ్యుయెలరీ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కళ్యాణ్ జ్యుయెలర్స్ షోరూం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారనీ, పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయన్ని చూసేందుకు ఆ కార్యక్రమానికి హాజరవుతారనీ నిర్వాహకులు చెబుతున్నారు. లులు హైపర్ మార్కెట్ పక్కనే ఈ కళ్యాణ్ జ్యుయెలర్స్ షోరూం ఏర్పాటయ్యింది. రాత్రి 9 గంటలకు ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రారంభోత్సవం సందర్భంగా ఐదుగురు లక్కీ విన్నర్స్కి 8 గ్రాముల గోల్డ్ గెల్చుకునే అవకాశం వుందనీ, అలాగే సూపర్ స్టార్ షారుక్తో సెల్ఫీ దిగే అవకాశం కల్పిస్తున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఖతార్లో ఇప్పటికే కళ్యాణ్ జ్యుయెలర్స్కి 7 బ్రాంచీలు వున్నాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







