అమరావతి సచివాలయ నిర్మాణానికి టెండర్లు
- April 27, 2018
అమరావతి రాజధాని నిర్మాణంలో సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో టవర్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. 5 టవర్లలో 69 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో సచివాలయం నిర్మాణం చేపట్టనున్నారు. రూ.2,176 కోట్లతో మూడు ప్యాకేజీలుగా టెండర్లు ఏర్పాటు చేశారు.
జీఏడీ టవర్ (50 అంతస్థులు) నిర్మాణం వ్యయం 530 కోట్లు కాగా, 40 అంతస్థుల చొప్పున మిగిలిన నాలుగు టవర్లు నిర్మించనున్నారు. 1, 2 టవర్ల నిర్మాణ వ్యయం- 895 కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణ వ్యయం- 751 కోట్లుగా నిర్ణయించారు. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 16 వరకు గడువు విధించారు. ప్రముఖ కంపెనీలు ఇంట్రెస్టుతో ఉన్నట్టు సమాచారం.
కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నాకా ఇకపై పై నుండి ఎలాంటి సాయం ఉండదు అనే నిర్ధారణకు వచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే డబ్బులకు కటకటలాడుతున్నా ముందుకు పోవడమే అని నిర్ణయించుకుని ముందడుగు వేశారు. ఇప్పటికే నిధుల సమీకరణకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







