మే 10న నేలటిక్కెట్టు ఆడియో.. చీఫ్ గెస్ట్గా పవన్ కల్యాణ్!
- May 07, 2018
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సోగ్గాడే చిన్నినాయనా ఫేం కల్యాణ్ కురసాల దర్శకత్వంలో రజనీ తాళ్లూరి రూపొందిస్తున్న చిత్రం నేలటిక్కెట్టు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ క్రమంలో చిత్ర ఆడియోను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
నేలటిక్కెట్టు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పవన్ కల్యాణ్ హాజరుకానున్నడంతో అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లతోపాటు భద్రతా చర్యలు చేపట్టే దిశగా చర్యలు తీసుకొంటున్నారు.
ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్పై రూపొందే నేలటిక్కెట్టు చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు. మాళవిక శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్గా, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, సత్యానంద్ మాటలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







