మే 10న నేలటిక్కెట్టు ఆడియో.. చీఫ్ గెస్ట్గా పవన్ కల్యాణ్!
- May 07, 2018
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సోగ్గాడే చిన్నినాయనా ఫేం కల్యాణ్ కురసాల దర్శకత్వంలో రజనీ తాళ్లూరి రూపొందిస్తున్న చిత్రం నేలటిక్కెట్టు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ క్రమంలో చిత్ర ఆడియోను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
నేలటిక్కెట్టు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పవన్ కల్యాణ్ హాజరుకానున్నడంతో అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లతోపాటు భద్రతా చర్యలు చేపట్టే దిశగా చర్యలు తీసుకొంటున్నారు.
ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్పై రూపొందే నేలటిక్కెట్టు చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు. మాళవిక శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్గా, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, సత్యానంద్ మాటలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









