సైరాలో మరో బాలీవుడ్ నటుడు!
- May 07, 2018
సైరా నరసింహారెడ్డి చిరంజీవి 151వ చిత్రం. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడుతోంది. రాం చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహస్తున్నాడు. ఆగస్టు 16, 2017 బుధవారం ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అన్ని సినీపరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తున్న ఈ ప్రాజెక్టులో తాజాగా మరో ప్రముఖ నటుడు ఈ జాబితాలో చేరిపోయారు.
రేసుగుర్రం చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన రవి కిషన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నటించనున్నాడు. ఇదివరకే కొన్ని సీన్స్ కి సంబంధించి షూట్ కూడా పూర్తయినట్లు సమాచారం. దాదాపు పది సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి రిమేక్ గా 'ఖైదీ నెంబర్ 150' చిత్రంలో నటించారు. వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాతగా ఈ చిత్రం మంచి విజయం అందుకుంది.
ఆ తర్వాత చిత్రం కూడా మరో అద్బుతమైన విజయం సాధించాలనే లక్ష్యంతో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'సైరా నరసింహా రెడ్డి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కిచ్చా సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతిలు నటించనున్నారు. హీరోయిన్ గా నయనతార కనిపించనుంది.
కొద్దికాలం క్రితమే అమితాబ్ బచ్చన్..ఈ సైరా సెట్స్ లో పాల్గొని తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. సైరా వర్కింగ్ స్టిల్స్ లో చిరు లుక్ యోధుడిలా అద్భుతంగా ఉండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









